Friday, 20 August 2021

‘చేతబడి ఫలితాలు దారుణం ఉన్నాయి.. ఏం తిన్నా అదే జరిగేది’: నటుడు టార్జాన్‌

ప్రస్తుతం ప్రపంచం అంతా సైంటిఫిక్‌గా మారిపోయింది. చాలా మంది కూడా దేవుడిని కానీ, దెయ్యాన్ని కానీ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. కనిపించిన విషయమే నిజమని.. లేకుంటే అది అవాస్తవమని నమ్మే మనుషల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కానీ, ఈ రోజుల్లో కూడా వంటివి జరుగుతున్నాయి అంటూ నటుడు టార్జాన్.. (లక్ష్మినారాయరణ గుప్తా) అంటున్నారు. తనపై చేతబడి జరిగిందని.. దాని కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాను అంటూ ఆయన పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘గాయం’ అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు టార్జాన్. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో విలన్‌గా, సైడ్ విలన్‌గా ఆయన పలు పాత్రల్లో ప్రేక్షకులకు వినోదం పంచారు. అయితే తన 30 ఏళ్లపాటు సినిమాల్లో నటుడిగా కొనసాగాను అని. సినీ కెరీర్‌ పరంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నారు. అయితే తమ దగ్గరి బంధువులు తమ ఎదుగుదలను ఓర్చుకోలేక చేతబడి చేశారు అని ఆయన అన్నారు. ఈ చేతబడి ఫలితాలు చాలా దారుణంగా ఉండేవి అని.. తన అమ్మ, అక్క, అన్నతో పాటు తనకు చేతబడి చేశారు అని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల తన అన్న ఏం తిన్న వాంతి జరిగేది అని.. తనకు అయితే నీళ్లు తాగినా వాంతి జరిగేది అంటూ ఆయన తెలిపారు. ఇలా దాదాపు 13 సంవత్సరాలు నరకం చూశామని ఆయన స్పష్టం చేశారు. దేవుడి దయవల్ల దాని నుంచి బయటపడ్డామని ఆయన తెలిపారు. ఆ తర్వాత తమ సొంత గ్రామం విడిచి వచ్చేశామని.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో.. తమ దశ మారిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత తనకి నటుడిగా మంచి గుర్తింపు వచ్చిందని.. కానీ, ఇప్పటికీ.. తమ సొంత గ్రామానికి వెళ్తే.. అక్కడ నీళ్లు తాగితే బయటకు వస్తాయని ఆయన అన్నారు. అమావాస్య, పౌర్ణమిలను నమ్మినప్పుడు చేతబడి ఉందని కూడా నమ్మాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gdSUpF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....