Friday, 8 January 2021

రవితేజ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘క్రాక్’ ప్రీమియర్, మార్నింగ్ షోలు రద్దు

మాస్ మహారాజా రవితేజ అభిమానులకు చేదు వార్త ఇది. తమ అభిమాన హీరో మాస్ ర్యాంపేజ్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూసిన రవితేజ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురికాక తప్పదు. ఎందుకంటే, యూఎస్ ప్రీమియర్ షోలు, ఇండియాలోని ఎర్లీ మార్నింగ్ షోలు రద్దయ్యాయి. ఫైనాన్సియర్లకు నిర్మాత సకాలంలో డబ్బులు తిరిగి చెల్లించకపోవడమే దీనికి కారణం. దీంతో భారత కాలమానం ప్రకారం యూఎస్‌లో శుక్రవారం తెల్లవారుజామున పడాల్సిన షోలు.. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో ఉదయం 8.30 నుంచి ప్రదర్శితమవ్వాల్సిన షోలు రద్దయ్యాయి. ఫైనాన్సియల్ క్లియరెన్స్ కారణంగా ‘క్రాక్’ సినిమా యూఎస్ ప్రీమియర్లు, ఇండియాలో ఉదయం షోలు రద్దయ్యాయని.. ఈరోజు మధ్యాహ్నం షోలు కూడా రద్దయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం ఫైనాన్సియల్ క్లియరెన్స్ అయిపోయిందని.. 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని ‘క్రాక్’ పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్లలో ఉదయం 11 గంటల షోకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే, శుక్రవారం తెల్లవారుజాము నుంచి ‘క్రాక్’ యూఎస్ టాక్ కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ తప్పదు. ఇదిలా ఉంటే ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కావడంతో ‘క్రాక్’పై భారీ అంచనాలున్నాయి. రవితేజ పోలీస్ క్యారెక్టర్ చేయడం, ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. రవితేజ కెరీర్‌లోనే భారీ ఎత్తున ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించారు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39ceuqh

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....