Tuesday, 19 January 2021

ఆది సాయికుమార్‌కు కరోనా పరీక్ష.. వీడియో షేర్ చేసిన హీరో

కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఏడెనిమిది నెలలు కెమెరాకు దూరమైపోయిన నటీనటులు ప్రస్తుతం తమ ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయారు. స్టార్ హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు జరుపుతున్నారు. అయినప్పటికీ వ్యక్తిగత భద్రత, సామాజిక బాధ్యతలో భాగంగా హీరోలు ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇటీవల రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలానే కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే, తాజాగా హీరో ఆది సాయికుమార్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాను కరోనా పరీక్షకు నమూనాలు ఇస్తున్నప్పుడు తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పరీక్షలో ఆదికి నెగిటివ్ రావాలని ఆయన అభిమానులు, ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, పరీక్షకు నమూనాలు ఇస్తున్న వీడియో పెట్టారు కానీ.. ఫలితం ఏంటనేది మాత్రం ఆది ఇంకా వెల్లడించలేదు. ఆయనకి కచ్చితంగా కొవిడ్ నెగిటివ్ రావాలని కోరుకుందాం. కాగా, ఆది ‘శశి’ సినిమాతో వస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుర‌భి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శక‌త్వం వహించారు. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మించారు. అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు. అమరనాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫి అందించారు. ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు మంచి స్పందన ల‌భించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qBK0Fb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....