లాక్డౌన్ వేళ వరుస సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తారో ఎవ్వరూ ఊహించని పరిస్థితి నెలకొంది. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఆ కథకు ముహూర్తం పెట్టేసి సెట్స్ పైకి తీసుకొస్తున్నట్లుంది వర్మ వాలకం చూస్తుంటే. ఇటీవలి కాలంలో ఎక్కువగా అడల్ట్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టిపెట్టిన ఆయన.. తాజాగా మళ్ళీ ట్రాక్ చేంజ్ చేశారు. నాటి ఆర్జీవీని మళ్లీ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు తాను డ్రీమ్ ప్రాజెక్ట్గా చెప్పుకుంటున్న '' వెబ్ సిరీస్పై ఫుల్ ఫోకస్ పెట్టారు. 'డీ కంపెనీ' పేరుతో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కథను తెరపైకి తీసుకొస్తున్నారు వర్మ. ముంబైలో ఒకప్పుడు అండర్ వరల్డ్ ఎలా రాజ్యమేలిందో కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నమే ఈ మూవీ. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా అఫీషియల్ టీజర్ రిలీజ్ చేసి అందరి దృష్టిని లాగేశారు. ఓ చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్స్టర్ ఎలా అయ్యాడు అనే పాయింట్ బేస్ చేసుకొని ఈ సినిమా రూపొందించారట వర్మ. టీజర్ ఆరంభం నుంచే ఆసక్తి రేకెత్తిస్తూ 1980 కాలంలో ముంబైలో జరిగిన ఘటనల తాలూకు సన్నివేశాలు చూపించారు. డీ కంపెనీ మామూలు కంపెనీ కాదని పేర్కొంటూ వయలెన్స్, డబ్బు, భయంతో ఒప్పందాలు లాంటి సీన్స్ తనదైన స్టైల్లో కట్ చేసి ఈ టీజర్ వదిలారు వర్మ. ఈ మూవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడో అంతా కూడా టీజర్లో డైలాగ్స్ లేకుండా చెప్పేశారు. చివరగా.. 'నా బలం లేకపోతే నీ తెలివేం చేస్తుంది' ఒకేఒక్క డైలాగ్ వినిపించారు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ ఈ సిరీస్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ గ్యాంగ్స్టర్ సినిమాల అన్నింటికి మదర్ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకురావడం విశేషం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Nv2okR
No comments:
Post a Comment