Tuesday, 26 January 2021

రిపబ్లిక్ డే వేడుకల్లో భాగమైన చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్.. రక్త దాతలకు మెగా అభినందనలు

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం నేడు (జనవరి 26) 72వ గణతంత్ర దినోత్సవ వేడుకులను జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అన్ని వీధుల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలంతా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకుల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం లాగే నేడు బ్లడ్ బ్యాంక్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో మెగా బ్రదర్ సహా చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అరవింద్ పాల్గొన్నారు. అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ టీమ్‌తో పాటు మెగా ఫాన్స్ కూడా భాగమయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మెగా అభిమానులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమాన్ని సందర్శించి, రక్తదానం చేసిన అభిమానులను చిరంజీవి, ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు 72వ గ‌ణ‌తంత్ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ''రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయ‌సంక‌ల్పించిన మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌కు వ‌చ్చి, ర‌క్త‌దానం చేసిన‌, చేస్తున్న రక్త‌ దాతలకు హృద‌య పూర్వక అభినందనలు'' అని పేర్కొన్నారు. మొత్తానికి ఇలా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మెగా అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున దేశ ప్రజలందరికీ 72వ గ‌ణ‌తంత్ర శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39ifKt6

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...