Sunday, 24 January 2021

‘జాతిరత్నాలు’కు పోటీగా ‘గాలి సంపత్’.. శివరాత్రికి నవ్వుల జాతర

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘గాలి సంప‌త్’. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే అందిస్తూ ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తున్నారు. వ‌రుస‌గా ఐదు బ్లాక్‌ బ‌స్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్యవేక్షణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్‌గా ‘గాలి సంప‌త్’ రూపొందుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. అనిల్ దగ్గర కో-డైరెక్టర్‌గా, రైట‌ర్‌గా పనిచేసిన ఆయన మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా మారి ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీవిష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డాక్టర్ రాజేంద్ర ‌ప్రసాద్ ‘గాలి సంప‌త్‌’గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనీష్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీని మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం విడుదల తేదీని ప్రకటించింది. అయితే, ఇదే రోజున మరో కామెడీ ఎంటర్‌టైనర్ కూడా విడుదలవుతోంది. వైజయంతీ మూవీస్ పుత్ర సంస్థ స్వప్న సినిమా బ్యానర్‌లో రూపొందిన ‘జాతి రత్నాలు’ సినిమా కూడా మార్చి 11నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే, శివరాత్రికి థియేటర్లలో నవ్వుల జాతరేనన్న మాట. కాగా, ‘గాలి సంపత్’ విడుదల తేదీని ప్రకటించిన సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘నా మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేస్తూ నేను స‌మ‌ర్పిస్తున్నాను. మార్చి 11న విడుద‌ల‌య్యే ‘గాలి సంప‌త్’ అద్భుత‌మైన న‌టీన‌టుల‌తో మిమ్మల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి వ‌స్తోంది. అంద‌ర్నీ అల‌రించే వెరైటీ సినిమా ఇది’’ అని అన్నారు. న‌ట‌కిరీటి రాజేంద్ర ప్రసాద్ మా‌ట్లాడుతూ.. ‘‘నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ‘గాలి సంప‌త్’ పాత్ర చాలా డిఫ‌రెంట్‌. ఇది ఒక కొత్త క్యారెక్టర్‌. కొత్తద‌నం ఉన్న మంచి సినిమా. కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు హృద‌యాన్ని తాకే గుడ్ ఎమోష‌న్స్ ఉన్న ‘గాలి సంప‌త్’ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది’’ అని అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘ఈ మహాశివ రాత్రి రోజు మీ అభిమాన థియేటర్లలో మీ సమక్షంలో నేను, మా నాన్న కలవబోతున్నాం. ఈ మార్చి 11న కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి థియేటర్లలో సిద్ధంకండి’’ అని అన్నారు. కాగా, ప్రస్తుతం సినిమా ఆఖరి షెడ్యూల్ జరుగుతోందని.. ఆదివారమే డబ్బింగ్ మొదలుపెట్టామని నిర్మాత ఎస్.క్రిష్ణ అన్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి నటించిన ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3a2GBZp

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....