Sunday, 24 January 2021

అనుకోకుండా మేం ముగ్గురం కలిసాం.. 30 ఏళ్ల తర్వాత ఇలా మీట్ కావడంతో! చిరంజీవి ఫీలింగ్స్‌పై మురళీమోహన్

దశాబ్దాల కాలంగా వెండితెరను ఏలుతూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన సినీ ప్రస్థానంలో 'గ్యాంగ్‌లీడర్‌' ఓ మైల్ స్టోన్. 1991 సంవత్సరంలో‌ హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ సినిమాతో అప్పటికే ఉన్న చిరంజీవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. చిత్రంలోని పాటలు, డైలాగ్స్‌, స్టోరీ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరపని ముద్ర వేశాయి. రఘుపతి, రాఘవ, రాజారామ్‌ అనే ముగ్గురు అన్నదమ్ముల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్ అయింది. అలా 'గ్యాంగ్‌లీడర్‌'తో సాధించిన విజయం తర్వాత చిరంజీవి వెనుతిరిగి చూడలేదని చెప్పడంతో అతిశయోక్తి లేదేమో. అయితే తన సినీ ప్రయాణంలో ప్రస్తుతం 152వ మూవీగా 'ఆచార్య' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చిరంజీవి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సమయంలో అనుకోకుండా ఎదురైన ఓ సంఘటనతో చిరంజీవి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 30 ఏళ్ల క్రిందటి 'గ్యాంగ్ లీడర్' బంధం మళ్ళీ ఎదురవడంతో ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిదని మురళీమోహన్ అన్నారు. అదేనండీ.. రఘుపతి, రాఘవ, రాజారామ్ 30 ఏళ్ల తర్వాత ఒకేచోట కలిశారట. రామోజీ ఫిలిం‌ సిటీలో జరుగుతున్న 'ఆచార్య' షూటింగ్‌లో భాగంగా చిరంజీవి, ఆర్కే మీడియా వారి చిత్ర షూటింగ్‌లో భాగంగా మురళీమోహన్‌, మణిరత్నం రూపొందిస్తున్న షూటింగ్‌లో భాగంగా శరత్‌కుమార్ రామోజీ ఫిలిం‌ సిటీ వెళ్లడంతో అనుకోకుండా ఈ ముగ్గురు కలుసుకోవడం జరిగింది. దీంతో ఆ ముగ్గురూ 'గ్యాంగ్‌లీడర్‌' జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తెగ సంతోష పడ్డారు. ముగ్గురూ కలిసి ఫొటోలు దిగుతూ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే ఈ మూమెంట్‌‌ మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో ఎంజాయ్‌ చేశారని, వెంటనే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి ఫొటోలు తీయించారని మురళీమోహన్‌ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39cbyLk

No comments:

Post a Comment

'Mark Mobius Saw India's Rise Before Other Investors'

'Mark Mobius's life was dedicated to investing.' from rediff Top Interviews https://ift.tt/V6zhcgU