Sunday, 18 October 2020

Pooja Hegde: ఆ రెండు రోజులు చాలా భయమేసింది.. ఇటలీలో పడిన ఇబ్బందులపై పూజా హెగ్డే ఓపెన్

కరోనా వచ్చి సినిమావాళ్ళ షెడ్యూల్స్ తలక్రిందులు చేసేసింది. మహమ్మారి వైరస్ కారణంగా గత ఆరు నెలలలకు పైగా ఇంటికే పరిమితమైన సినీ నటులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్ అనుమతులు రావడంతో '' యూనిట్ ఇటలీ వెళ్ళింది. ప్రభాస్‌-పూజాహెగ్డేపై పలు కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇటలీ షూటింగ్ అనుభవాలు, అక్కడి పరిస్థితుల గురించి వెల్లడించింది హీరోయిన్ . ఇటలీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారని షూటింగ్ ప్రారంభమయ్యాక మొదటి రెండు మూడు రోజులు చాలా భయంగా అనిపించిందని తెలిపింది. ఇబ్బందిగా ఫీల్ అయ్యానని, ఆ తర్వాత మామూలై పోయిందని చెప్పింది. సెట్ లోకి అడుగుపెట్టే ముందే అందరికీ కరోనా టెస్టులు చేయడం, సెట్‌లో ఉంటే మాస్కు ధరించడం తప్పనిసరి అనే రూల్ పెట్టి షూటింగ్ జరుపుతున్నారని తెలిపింది. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాస్కు తీసేస్తున్నాం తప్ప మిగితా సమయంలో మాస్కులతో చాలా జాగ్రత్తగా ఉంటున్నామని చెప్పింది. Also Read: ఇకపోతే 'రాధే శ్యామ్' చిత్రంలో తాను డ్యూయల్ రోల్ పోషిస్తున్నానని వస్తున్న వార్తలపై స్పందించిన పూజా.. తనది ఒకే పాత్ర అని కన్ఫర్మ్ చేసింది. కాకపోతే మునుప్పెన్నడూ లేనివిధంగా తన టాలెంట్‌ బయటపెట్టేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ను అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nVVNxs

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....