Saturday, 24 October 2020

రామ్ ‘రెడ్’ నుంచి థ్రిల్లింగ్ అప్‌డేట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఎనర్జిటిక్ స్టార్ చేసిన చిత్రం ‘రెడ్’. రామ్‌తో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’ వంటి క్లాస్ మూవీస్‌ను రూపొందించిన తిరుమల కిశోర్ ‘రెడ్’కు దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ‘రెడ్’ సినిమా కోసం రామ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఈ సినిమాలో రామ్ గెటప్, తిరుమల కిశోర్ మీద ఉన్న నమ్మకం. రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమా కథను రాసుకున్నారు కిశోర్. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని గత కొద్ది నెలలుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే, తమకు ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని, థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని నిర్మాత స్రవంతి రవికిశోర్ ఇప్పటికే స్పష్టం చేశారు. Also Read: ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ చేసిన ప్రకటన ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. దసరా సందర్భంగా రేపు ‘రెడ్’ సినిమా నుంచి థ్రిల్లింగ్ అప్‌డేట్ రాబోతోంది. ఈ మేరకు శనివారం నిర్మాణ సంస్థ ఒక ప్రకటన చేసింది. రేపు ఉదయం 9.30 గంటలకు థ్రిల్లింగ్ అప్‌డేట్ ఇవ్వడోతున్నామని పేర్కొంది. రామ్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అప్‌డేట్ ఇవ్వబోతున్నారు. ఆ అప్‌డేట్ థియేటర్ రిలీజ్ డేట్ అని తెలుస్తోంది. ఎందుకంటే శ్రీ స్రవంతి మూవీస్ చేసిన ట్వీట్‌లో ఈ విషయం స్పష్టమవుతోంది. శ్రీ స్రవంతి మూవీస్ చేసిన ఈ ప్రకటనతో రామ్ అభిమానుల్లో ఊపొచ్చింది. థియేటర్‌లో విడుదల చేస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. ఇదే గనుక నిజం అయితే లాక్‌డౌన్ తరవాత థియేటర్లలో విడుదలవుతోన్న తొలి తెలుగు చిత్రం ఇదే అవుతుంది. కాగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు పీటర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HwJfMs

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...