Sunday, 18 October 2020

అనుష్క ఖాతాలో అరుదైన రికార్డు.. మిక్స్‌డ్ టాక్ వచ్చినా నిలబడిన ‘నిశ్శబ్దం’

శెట్టి, మాధవన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘నిశ్శబ్దం’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అనుష్కకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీ, సినిమాకు ఉన్న ప్రత్యేకతతో తొలిరోజే ‘నిశ్శబ్దం’ అత్యధిక వ్యూస్‌ను సాధించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై సుమారు మూడు వారాలు అయ్యింది. ఇప్పుడు మరో ఫీట్‌ను అనుష్క చిత్రం అందుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై అత్యధిక వ్యూస్ సాధించిన ఫీమేల్ సెంట్రిక్ సౌత్ ఇండియన్ మూవీగా ‘నిశ్శబ్దం’ రికార్డు సాధించింది. నిజానికి ఈ అరుదైన రికార్డ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే, ‘నిశ్శబ్దం’ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే, ఆడియన్స్ నుంచి డివైడ్ టాక్‌ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. చిత్ర కథ గొప్పగా లేకపోయినా మంచి సాంకేతిక విలువలు, డైరెక్టర్ నెరేషన్ సినిమాను ఆకర్షణీయంగా తయారుచేశాయి. అనుష్క నటన, మంచి తారాగణం ప్రేక్షకులను సినిమావైపు చూసేలా చేశాయి. మొత్తం మీద రికార్డు స్థాయి వ్యూవర్‌షిప్‌తో అనుష్క ‘నిశ్శబ్దం’ అరుదైన రికార్డును సాధించింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ‘నిశ్శబ్దం’ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. గోపీ సుందర్ పాటలు స్వరపరిచారు. గిరీష్ గోపాలక్రిష్ణన్ నేపథ్య సంగీతం సమకూర్చారు. షనీల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31n7DqN

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....