ఈ లాక్ డౌన్ కొందరి జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంటే.. ఇదే లాక్ డౌన్ మరికొంత మందికి తీయని వేడుకలకు వేదిక అవుతూ.. మధుర జ్ఞాపకాలను మిగుల్చుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో కీలక ఘట్టమైన పెళ్లి బంధానికి ఈ లాక్ డౌన్నే సరైన ముహూర్తంగా భావిస్తున్నారు సెలబ్రిటీలు. ఎంత మంది వచ్చారు.. ఎంత ఘనంగా జరిగిందన్నది కాదు.. పెళ్లి అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం అనే భావనతో పెళ్లి బంధంతో ఒకటి అవుతున్నారు కొత్త జంటలు. ఇప్పటికే టాలీవుడ్లో దిల్ రాజు, నిఖిల్లు ఈ లాక్ డౌన్లోనే పెళ్లి చేసుకుని కొత్త కాపురాలు మొదలుపెట్టగా.. త్వరలో రానా, నితిన్లు సైతం పెళ్లికి రెడీ అయ్యారు. రీసెంట్గా వీరి లిస్ట్లోకి ప్రముఖ బుల్లితెర హీరోయిన్ కూడా చేరింది. తనకు కాబోయే వరుడిని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది ఈ కొత్త పెళ్లి కూతురు. జూన్ 4న లతా సంగరాజు పుట్టిన రోజు కావడంతో అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తూ.. ప్రీ వెడ్డింగ్ స్టార్ అంటూ తనకు కాబోయే వాడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది లతా సంగరాజు. జూన్ 14న లతా సంగరాజు వివాహం జరగనుంది. తేనె మనసులు, రామాసీత వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన లతా సంగరాజు.. నేత్ర అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ నటించింది. మలయాళంలో ‘నీలక్కుఇల్’ అనే షోతో పాపులర్ అయ్యింది లతా సంగరాజు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UfB1Mc
No comments:
Post a Comment