Saturday, 5 October 2019

సాయి పల్లవి, తమన్నాకు ఛాలెంజ్ విసిరిన ‘గద్దలకొండ గణేష్’

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, మిల్కీ బ్యూటీ తమన్నాకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒక ఛాలెంజ్ విసిరారు. అది మొక్కలు నాటే ఛాలెంజ్. అఖిల్ అక్కినేని విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి పూర్తిచేసిన వరుణ్.. ఇప్పుడు సాయి పల్లవి, తమన్నాకు విసిరారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదలెట్టిన సంగతి తెలిసిందే. Also Read: ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపునకు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం నుండి ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీల వరకు అందరూ స్పందించి విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరుతో ఎంపీ సంతోష్ చాలా మంది ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలకు ఈ ఛాలెంజ్ విసిరారు. ఈ సెలబ్రిటీల్లో అఖిల్ అక్కినేని కూడా ఉన్నారు. ఆ తరవాత అఖిల్ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సోదరుడు నాగచైతన్య, వరుణ్ తేజ్‌కు విసిరారు. అఖిల్ ఇచ్చిన ఛాలెంజ్‌ను పూర్తిచేసిన వరుణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సాయి పల్లవికి, తమన్నాకు విసిరారు. ‘‘నన్ను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ గారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన అఖిల్ అక్కినేనికి కృతజ్ఞతలు. కొంచెం బిజీగా ఉన్నాను. అయినప్పటికీ, ఒక మంచి పని చేయడానికి ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. ఈ మంచి పని చేయడానికి నేను సాయి పల్లవి, తమన్నాను నామినేట్ చేస్తున్నను’’ అని వరుణ్ ట్వీట్ చేశారు. కాగా, ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన వారందరికీ వనమిత్ర అవార్డ్స్ ఇవ్వనున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ ప్రకటించారు. దీంతో పాటు మొక్కలు నాటినవారికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్ ఇవ్వాలని ఇప్పటికే ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ నిర్ణయించింది. మొక్కలు నాటిన వారందరికీ వనమిత్ర అవార్డులను త్వరలో అందజేస్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2IpqAQa

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....