Thursday, 3 October 2019

కందిరీగ దర్శకుడితో `రాక్షసుడు`

రాక్షసుడు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో ఎక్కువగా మాస్‌ కమర్షియల్ చిత్రాలు చేసి ఈ యంగ్ హీరో తరువాత రూట్‌ మార్చి ప్రయోగాల బాటపడ్డాడు. అయితే ఈ ప్రయత్నాలో ముందు కాస్త తడబడినా రాక్షసుడుతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీత సినిమా డిజాస్టర్‌ కావటంతో ఇబ్బందుల్లో పడ్డ సాయి శ్రీనివాస్‌ వెంటనే రాక్షసుడు సినిమాతో సక్సెస్‌ ట్రాక్‌ లోకి వచ్చాడు. అయితే మరోసారి తనకు బాగా పట్టున్న మాస్‌ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. కందిరీగ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. సంతోష్‌ మూడేళ్ల విరామం తరువాత తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. Also Read: రాక్షసుడు తరువాత మంచి స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ చెప్పిన కథ నచ్చటంతో వెంటనే ఓకె చెప్పేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌ త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. కొద్ది రోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు. సక్సెస్‌ విషయం ఎలా ఉన్నా హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలి సినిమా నుంచి తన మార్క్‌ చూపిస్తూ వస్తున్నాడు. అల్లుడు శ్రీను, జయజానకీ నాయక, కవచం లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్లు చేసిన సాయి తరువాత సీత లాంటి ప్రయోగం చేసి ఫెయిల్‌ అయ్యాడు వెంటనే. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కిన రీమేక్‌ మూవీ రాక్షసుడుతో తిరిగి సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2oMARz4

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....