Tuesday 7 September 2021

Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన రానా.. హీరోపై అధికారుల ప్రశ్నల వర్షం!!

మరోసారి సినీ వర్గాలను కుదిపేస్తోంది. డ్రగ్స్ సరఫరా, మనీ లాండరింగ్ ఇష్యూలను సీరియస్‌గా తీసుకున్న ఈడీ అధికారులు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సినీ ప్ర‌పంచంతో డ్ర‌గ్స్ మాఫియాకు ఉన్న సంబంధాల‌పై ఈడీ అధికారులు లోతుగా విచార‌ణ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, హీరోయిన్ ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్‌, యాక్టర్ నందు విచారణకు హాజరు కాగా.. తాజాగా నేడు (బుధవారం) హీరో వంతు వచ్చింది. దీంతో తన వ్యక్తిగత సిబ్బందితో పాటు కొద్దిసేపటి క్రితం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు దగ్గుబాటి రానా. ఆయన వెంట ఆడిటర్స్‌, అడ్వకేట్స్‌ కూడా ఉన్నారు. విచారణలో భాగంగా రానాకు డ్రగ్స్ పెడల్స్‌తో ఎలాంటి లింక్స్ ఉన్నాయనే కోణంలో ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్‌ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను, ఆర్ధిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట ఈడీ ఆఫీసర్స్. కెల్విన్‌తో రానాకు ఎలాంటి సంబంధాలున్నాయి? ఎఫ్ క్లబ్ గురించి ఏమైనా తెలుసా..? వీళ్లిద్దరి మధ్య ఏవైనా లావాదేవీలు జరిగాయా? ఇలా అనేక విషయాలపై రానాను లోతుగా ప్రశ్నించనున్నారని తెలుస్తోంది. నేడు రానాతో పాటు మరో యాక్టర్ ముమైత్‌ ఖాన్‌ని సైతం ఈడీ అధికారులు విచారించనున్నారు. నిజానికి ఎక్సైజ్ సిట్ దర్యాప్తులో రానా, రకుల్ ప్రీత్‌ సింగ్‌ పేర్లు తెరపైకి రాలేదు. కానీ ఈడీ దర్యాప్తులో భాగంగా ఇద్దరి పేర్లు తెరపైకి రావడంతో విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. సెప్టెంబ‌ర్ 9న ఇదే కేసులో ర‌వితేజ విచారణకు హాజ‌రుకానున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YqxL5p

No comments:

Post a Comment

'I Plan To Sue This Minister For 100 Cr'

'Her outrageous comments cannot be allowed to slide under the crack.' from rediff Top Interviews https://ift.tt/cMw6vd5