సినీ నటుడు, సింగర్ సింగర్ గీతా మాధురి భర్త నందు మంగళవారం ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల ముందు హాజరయ్యారు. సినీ ప్రపంచంతో డ్రగ్స్ మాఫియాకు ఉన్న సంబంధాలపై సంబంధిత అధికారులు విచారణ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈడీ అధికారులకు కేసును అప్పగించిన సంగతి తెలిసిందే. సదరు అధికారులు ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్లను విచారించారు. ఇది వరకే పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి ఒక్కో రోజు ఒక్కొక్కరిగా విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో యాక్టర్ నందు మంగళవారం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. డ్రగ్స్ వినియోగం, ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై నందుని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ అప్రూవర్గా మారి ఇచ్చిన సమాచారంతో ఈ విచారణ కొనసాగుతుంది. నిజానికి ఆగస్ట్ 20వ తేదీనే హాజరు కావాల్సిన నందు కొన్ని కారణాలతో తాను ఆరోజున హాజరు కాలేనని చెప్పి వారి పర్మిషన్ తీసుకుని ఈరోజు హాజరయ్యారు. ఈ కేసులో రేపు రానా దగ్గుబాటి విచారణకు హాజరు కానుండగా, సెప్టెంబర్ 9న రవితేజ హాజరవుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ను అయితే ఈడీ అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. రకుల్ విచారణలో అయితే ఆమె బ్యాంకు అకౌంట్స్పై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రశ్నించారు. కెల్విన్కు కూడా రకుల్ ప్రీత్ సింగ్ చాలా సార్లు డబ్బులు పంపినట్లు అధికారులు నిర్దారించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DRoRhz
No comments:
Post a Comment