Saturday 18 September 2021

Samantha Ruth Prabhu: బుద్ధుందా! అంటూ మీడియాపై స‌మంత సీరియ‌స్‌

హీరోయిన్ మీడియాపై తన కోపాన్ని వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ ఆమెందుకు మీడియాపై ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారనే వివ‌రాల్లోకెళ్లే.. వీలున్న‌ప్పుడల్లా క‌లియుగ దైవంగా కొలుచుకునే వెంటేశ్వ‌ర స్వామి ద‌ర్శనానికి స‌మంత వెళుతుంటుంది. అలాగే ఈసారి కూడా స‌మంత తిరుమ‌ల‌కు వెళ్లారు. అక్క‌డ ఆమెకు సాద‌ర స్వాగ‌తం ల‌భించింది. అక్కడున్న కొంద‌రు ఫొటోగ్రాఫ‌ర్స్ స‌మంతను ఫొటోలు తీసుకోవాలంటూ ఓ రెండు క్ష‌ణాలు ఆగాలంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే ఆమె ఫొటో దిగ‌లేదు.. గుడికొచ్చా..బుద్ధుందా! అంటూ స‌ద‌రు వ్య‌క్తుల‌కు కోపంగా బ‌దులిచ్చారు. అయితే స‌మంత మీడియా ప‌ర్స‌న్‌కు అలా స‌మాధానం చెప్పిందా లేక బ‌య‌ట మ‌రెవ‌రికైనా అలా చెప్పిందా? అని మాత్రం తెలియ‌డం లేదు కానీ.. స‌మంత బుద్ధుందా! అన్న వీడియో మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. చైత‌న్య సినిమా విడుద‌ల‌య్యే ప్ర‌తి సంద‌ర్భంలోనూ స‌మంత శ్రీవారిని ద‌ర్శించుకుంటూ ఉంటుంది. త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య న‌టించిన ల‌వ్‌స్టోరి సినిమా విడుద‌ల ఉంది. ఈ కార‌ణంతో ఆమె తిరుమ‌ల‌కు వ‌చ్చిందా? లేక త‌మిళులు ఏంతో నిష్ట‌గా జ‌రుపుకునే పుర‌టాశి నెల‌లో తొలి శ‌నివారం కాబ‌ట్టి తిరుమ‌ల‌కు వ‌చ్చిందా? అనేది తెలియ‌డం లేదు. రీసెంట్‌గా స‌మంత వ్య‌క్తిగ‌త జీవితంలో స‌మ‌స్య‌లున్నాయంటూ, భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విబేదాలు వ‌చ్చాయ‌ని, ఆయ‌న‌తో దూరంగా ఉంటుంద‌ని.. త్వ‌ర‌లోనే ఇద్ద‌రూ విడాకులు తీసుకోబోతున్నారంటూ కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో స‌మంత మీడియాకు వీలైనంత దూరంగా ఉంటుంది. త‌న వివాహ‌బంధం గురించి మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌పై ఆమె స్పందించ‌డం లేదు. స‌మ‌యం వ‌చ్చినప్పుడే స్పందిస్తాన‌ని అంటోంది. ఇక‌ సినిమాల విష‌యానికి వ‌స్తే.. రీసెంట్‌గానే శాకుంత‌లం సినిమాను పూర్తి చేసిన స‌మంత త్వ‌ర‌లోనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌లో శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మాణంలో ఓ ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా చేయ‌బోతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nJFFBr

No comments:

Post a Comment

'Critics Wait 20 Years To Like My Films'

'Whenever people say to me that all my work looks unique, I say to them originality is the art of concealing your source.' from re...