Monday 6 September 2021

‘RX 100’ డైరెక్టర్‌ని కథ చెప్పమన్న స్టార్ హీరో.. ఈసారి పాన్ ఇండియా మూవీ పక్కానా?

కాస్త స‌మ‌యం ప‌డుతుందేమో కానీ.. క‌ష్ట‌ప‌డేవారికి, ఎప్ప‌టికీ గుర్తింపు ఉంటుందనే విష‌యం డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ప‌క్కాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ డైరెక్ట‌ర్‌కు వ‌చ్చిన అవ‌కాశం అలాంటిది మ‌రి. ఇంత‌కీ అజ‌య్‌కి ఎలాంటి అవ‌కాశం వ‌చ్చింద‌నే వివ‌రాల్లోకెళ్తే... ఇటు తెలుగు, త‌మిళ సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు అటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన హీరోల్లో ధ‌నుశ్ ఒక‌డు. అడ‌పాద‌డ‌పా బాలీవుడ్‌లో న‌టించిన ధ‌నుశ్‌, త‌న అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఇప్పుడు రూట్ మార్చాడు. త‌ను కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ధ‌నుశ్ ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌క‌ముందే మ‌రో తెలుగు ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి ధ‌నుశ్ ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు..మ‌న అజ‌య్ భూప‌తి. రీసెంట్‌గా గోవాలో ధ‌నుశ్‌, అజ‌య్ భూప‌తి క‌లుసుకున్నార‌ట‌. ముఖ్యంగా ధ‌నుశ్ ఈ సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌డ‌మే అందుకు కార‌ణం. ఇప్పుడు ధ‌నుశ్ కోసం అజ‌య్ భూప‌తి సినిమాను త‌యారు చేసే ప‌నిలో ఉన్నాడని టాక్‌. ధ‌నుశ్‌కున్న క్రేజ్‌ను బ‌ట్టి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లోనే రూపొంద‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’ త‌ర్వాత రెండో చిత్రంగా ‘మహా సముద్రం’ను స్టార్ట్ చేయడానికి అజయ్ భూపతికి చాలా సమయమే పట్టింది. అయితే, ఆ సినిమా పూర్తి కాక ముందే పాన్ ఇండియా సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చింద‌ని అంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l0rdlJ

No comments:

Post a Comment

'Government Must Talk To Sonam Wangchuk'

'Ladakh has become a hollow UT.' from rediff Top Interviews https://ift.tt/MtBvKLU