టాలీవుడ్ నటుడు నవదీప్ను డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. ఈ విచారణ దాదాపు తొమ్మిది గంటల పాటు కొనసాగడం గమనార్హం. నవదీప్తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్ను ఈడీ అధికారులు ఏక కాలంలో ఒకే గదిలో ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణలో విదేశీయులకు ఎఫ్ క్లబ్ ద్వారా ఎలాంటి డీలింగ్స్ జరిగాయనే దానిపై ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఎఫ్ క్లబ్ మేనేజర్ తాను నవదీప్ చెప్పినదాన్ని అనుసరించే డబ్బులు పంపానని, ఎవరికి, ఎందుకు, ఎంత పంపాలనేది నవదీప్ చూసుకున్నాడంటూ అధికారులకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు నవదీప్, విదేశీ కస్టమర్స్ రావడం వల్ల ఎలాంటి లాదేవీలు జరిగాయనే దాన్ని వివరించినట్లు టాక్. ఈ విచారణ దాదాపు తొమ్మిది గంటల పాటు సాగింది. అది కూడా నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ను ఒకే గదిలో ప్రశ్నించడంతో ఎలాంటి సమాచారం బయటకు వచ్చిందోనని కొందరిలో టెన్షన్ మొదలైంది. చాలా ప్రశ్నలకు నవదీప్ సమాధానం దాటవేసే ప్రయత్నం చేసినట్లు, ఆయన చెప్పిన సమాధానాలకు ఎఫ్ క్లబ్ మేనేజర్ చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో ఈడీ అధికారులు ఇద్దరినీ ఒకే రూమ్లో ఉంచి ప్రశ్నించారని వార్తలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ను సప్లయ్ చేసిన కెల్విన్, పీటర్ ఖాతాల్లోకి ఎఫ్ క్లబ్ నుంచి చాలా నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు తెలుస్తోంది. 2015 నుంచి 2017 వరకు ఎఫ్ క్లబ్ నుంచి డబ్బులకు సంబంధించిన లావాదేవీలు జరిగాయి అనే దానిపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. విచారణ ముగిసిన తర్వాత తమకు అందుబాటులోనే ఉండాలని ఈడీ అధికారులు నవదీప్కు సూచించారని కూడా సమాచారం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k6RYph
No comments:
Post a Comment