Friday 3 September 2021

MAA Elections : అందుకే సుధీర్, అనసూయలను తీసుకున్నా.. ప్రకాష్ రాజ్ కామెంట్స్

మా ఎన్నికల్లో ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. తన ప్యానల్‌ను ఇది వరకే ప్రకటించారు. తన టీం సభ్యులు అంటూ అందరినీ మీడియా ముందుకు తీసుకొచ్చారు. అలా మొదటి సమావేశంతోనే ప్రకాష్ రాజ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ప్యానెల్ సభ్యులంటూ అందరినీ పరిచయం చేశారు. అయితే ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అందరి అభిప్రాయం మేరకే కొత్త ప్యానెల్ సభ్యులను ప్రకటిస్తున్నానని, కొత్త వారికి చాన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలో తన ప్యానెల్‌ మెంబర్స్‌ను ప్రకాష్ రాజ్ ప్రకటిస్తూ.. ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు. కొత్త వారికి, కుర్రాళ్లకి, మహిళలకు, బుల్లితెరకు అందరికీ ఇలా సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇలా ప్యానెల్‌ను డిజైన్ చేశామని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ క్రమంలోనే టీవీ ఇండస్ట్రీ నుంచి కౌశిక్, ప్రభాకర్, , సుధీర్ వంటి వారిని సెలెక్ట్ చేశామని అన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్‌గా అనసూయ, సుధీర్‌లను సెలెక్ట్ చేయడం వెనుకున్న కారణాలు కూడా వివరించారు. అనసూయ.. బుల్లితెరపై నటీనటులకు ఉన్న కష్టాల గురించి తెలుసు.. ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడేంత సత్తా కూడా ఉంది అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక సుధీర్ గురించి చెబుతూ.. బుల్లితెరపై ఐకాన్ అని అనేశారు. అలాంటి కుర్రాళ్లతో పని చేస్తే మాక్కూడా కొత్త ఐడియాలు వస్తాయని, అలాంటి వారితో పని చేయాలనే ఉద్దేశ్యంతోనే సుధీర్‌ను కూడా తీసుకున్నామని ప్రకాష్ రాజ్ తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yEO9vv

No comments:

Post a Comment

'Looking to expand international business'

'It is difficult to write business internationally, without an 'A-' rating. It becomes more expensive.' from rediff Top In...