Thursday 2 September 2021

డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన రకుల్.. ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు! హీరోయిన్‌పై ప్రశ్నల పరంపర

మరోసారి సినీ వర్గాలను కుదిపేస్తోంది. డ్రగ్స్ సరఫరా, మనీ లాండరింగ్ ఇష్యూలను సీరియస్‌గా తీసుకున్న ఈడీ అధికారులు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, హీరోయిన్ ఛార్మిలపై విచారణ చేపట్టి కీలక సమాచారాన్ని రికార్డ్ చేశారు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆఫీసర్స్. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం (శుక్రవారం ఉదయం) రకుల్ ప్రీత్ ఈడీ కార్యాలయానికి చేరుకొని అధికారుల విచారణలో పాల్గొంది. నిజానికి ముందుగా ఇచ్చిన ఈడీ నోటీసుల ప్రకారం ఈ కేసు విచారణలో భాగంగా సెప్టెంబర్ 6వ తేదీన రకుల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ తేదీన తాను రాలేనని తన విచారణ తేదీ మార్చాలని కోరుతూ ఈడీకి లేఖ రాసింది రకుల్. అయితే రకుల్ రిక్వెస్ట్‌ని ఈడీ ఆఫీసర్స్ రిజెక్ట్ చేశారు. దీంతో మూడు రోజులు ముందుగా వచ్చేందుకు రెడీ అంటూ ఆమె మరో మెయిల్ పంపడంతో ఈడీ సమ్మతించింది. ఈ నేపథ్యంలోనే నేడు (సెప్టెంబర్ 3) ఈడీ కార్యాలయానికి చేరుకుంది . రకుల్ రాక నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు నడుమ ఈడీ కార్యాలయంలో రకుల్ విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ పెడల్, మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారట. రకుల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ కూపీ లాగుతున్నారట. డ్రగ్స్‌ దందాలో ప్రధాన సూత్రధారులు, కెల్విన్‌‌తో సంబంధాల గురించి ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. రకుల్ వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mVbqHv

No comments:

Post a Comment

Exclusive! 'Kamala Is Like A Daughter To Me'

'Kamala likes south Indian food.' from rediff Top Interviews https://ift.tt/x7amYjE