Saturday 4 September 2021

హీరోయిన్ త్రిషకు ఊహించని షాక్.. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి అంటూ డిమాండ్

తన అందం, అభినయంతో దాదాపు ఒక దశాబ్ధకాలం స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ . తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా స్టార్ హీరోలు అందరితో నటించి తన గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చెన్నై సుందరి. ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’,‘బాడీగార్డ్‌’, ‘స్టాలిన్‌’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి త్రిష. అయితే గత కొంతకాలంగా మాత్రం ఆమె కాస్త స్లో అయ్యారు. చాలా కాలంగా ఆమె మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం త్రిష.. సెన్సేషనల్ దర్శకుడు రూపొందిస్తున్న ‘’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి, జయరామ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు అడుగడుగునా.. ఏదో ఒక సమస్య వస్తోంది. కొద్ది రోజుల క్రితమే షూటింగ్‌లో ఓ గుర్రం చనిపోవడంతో దర్శకుడు మణిరత్నంపై పెటా సంస్థ కేసు పెట్టింది. తాజాగా నటి త్రిషను అరెస్ట్ చేయాలి అంటూ హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు కారణం ఆమె దేవాలయంలో చెప్పులు వేసుకొని తిరగడమే. ప్రస్తుతం ఈ సినిమా ఇండోర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో భాగంగా త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో హిందు సంఘం నేతలు త్రిషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పని చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు త్రిషపై కేసు నమోదు చేసి.. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kSxGze

No comments:

Post a Comment

'We want to be trust marker for the fintech industry'

'So, we would work with our members to ensure that we as an SRO create some sort of due diligence for fintechs.' from rediff Top I...