యంగ్ హీరో సినీ జర్నీ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో అనూహ్యంగా యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకున్నాడు ఈ రౌడీ స్టార్. ఆ తర్వాత ''గీత గోవిందం, టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్'' లాంటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆయన.. అటు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరిట వస్త్ర వ్యాపారం మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఓ వీడియో ద్వారా రివీల్ చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు విజయ్ దేవరకొండ. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. AVD (ఏసియా విజయ్ దేవరకొండ) సినిమాస్ పేరుతో సర్వ హంగులతో మల్టీప్లెక్స్ థియేటర్ కట్టేశారు. తన స్వస్థలమైన మహాబూబ్నగర్లో ఈ థియేటర్ ఏర్పాటు చేసిన విజయ్ దేవరకొండ.. 'లవ్స్టోరీ' సినిమాతో ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కాబోతోందని తెలిపారు. లైఫ్లో ముఖ్యమైన అంశమంటూ తన మల్టీప్లెక్స్ ఓపెనింగ్ విషయాన్ని తెలిపారు విజయ్ దేవరకొండ. ఇది తన లైఫ్లో బిగ్ మూమెంట్ అని చెప్పిన విజయ్.. ప్రస్తుతం 'లైగర్' షూటింగ్ నిమిత్తం గోవాలో ఉన్నందున సెప్టెంబర్ 24న ఈ థియేటర్ ఓపెనింగ్కి రాలేకపోతున్నానని చెప్పారు. మల్టీప్లెక్స్ నిర్మించాలన్న తన డ్రీమ్ నిజమైందని ఆయన పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లైగర్' సినిమా పనులతో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్త సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్లు నిర్మిస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lDZEPA
No comments:
Post a Comment