Saturday 11 September 2021

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్: అందుకే రియాక్ట్ కాలేదు.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్

మెగా మేనల్లుడు రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా సాయి తేజ్ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అయితే సాయి తేజ్‌ని చూడటానికి అపోలో ఆసుపత్రికి వచ్చిన మంచు విష్ణు.. మీడియా పాయింట్‌ దగ్గర తాను ఎందుకు మాట్లాడకుండా వెళ్లిపోయాననే విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన సందేశం పోస్ట్ చేశారు. సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు లేదా చికిత్స అందిస్తున్న వైద్యులు స్పందిస్తేనే బాగుంటుంది గానీ వేరే ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదని తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతే తప్ప మీడియాతో కఠినంగా వ్యవహరించాలనేది తన ఉద్దేశ్యం కాదని అన్నారు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని మీరు, నేను, అందరం ప్రార్థిద్దాం అని ఆయన తెలిపారు. మరోవైపు విషయమై పెద్ద ఎత్తున వార్తలు షికారు చేస్తున్నాయి. అతివేగమే ఆయన ప్రమాదానికి కారణమని అంటున్నారు. కానీ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే బైక్‌పై సాయి తేజ్ మితిమీరిన వేగంతో ప్రయాణించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో సాయి తేజ్‌కి మెరుగైన చికిత్స అందిస్తున్నాయి అపోలో లోని ప్రత్యేక వైద్య బృందాలు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zel4rn

No comments:

Post a Comment

When Amitabh, Rajesh Khanna Broke The Ice

Amitabh Bachchan: 'Success didn't affect me at all.' from rediff Top Interviews https://ift.tt/mXlOqDN