షో ఐదో సీజన్ ప్రారంభమయ్యేందుకుం రంగం సిద్దమైంది. రేపు (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరుగంటలకు ఐదో సీజన్ గ్రాండ్గా ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల లిస్ట్ కూడా లీకైపోయింది. దాదాపు లీకైన సభ్యులే బిగ్ బాస్ ఇంట్లోనూ ఉండబోతోన్నట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి సమయంలో వేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. పూనమ్ కౌర్ గతాన్ని తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతోన్న ఈ తరుణంలో ఆమె ఇలాంటి ట్వీట్లు చేస్తుండటంతో నెటిజన్లు సైతం గందరగోళానికి గురి అవుతున్నారు. పేరు ఎక్కడా ఎత్తకుండానే.. అతడి భాగోతాల గురించి పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. దళితుడికి గుండు కొట్టించాడు.. ఎంతో మందిని మోసం చేశాడు.. పోలీస్ ఆఫీసర్ అంటూ ఎంతో మందిని బోల్తా కొట్టించాడు.. పెద్ద హీరోలు, దర్శకుల పేర్లు చెప్పి ఎంతో మందిని మోసం చేశాడు అంటూ పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. ఈ విషయాలన్నీ చెబుతూ.. నూతన్ నాయుడు గత ఏడాది పవన్ కళ్యాణ్కు విషెస్ చెబుతూ షేర్ చేసిన పోస్ట్ను కూడా బయటపెట్టేశారు. ఇలా పేర్లు చెప్పుకోవడం, ఫ్యాన్ అని చెప్పుకోవడంపైనా నూతన్ నాయుడును పరోక్షంగా పూనమ్ కౌర్ ఏకిపారేశారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారంటూ నెటిజన్లు పూనమ్ను ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను అరెస్ట్ చేశారు. బెయిల్ మీద కూడా బయటకు వచ్చాడు.. మళ్లీ ఇప్పుడు ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నారంటూ అడుగుతున్నారు. బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ట్రాక్ రికార్డ్ పరిశీలించండి.. అయినా షోలు, ఎంటర్టైన్మెంట్ అనేది క్రిమినల్ పనులు చేసేందుకు దారి తీయొద్దు.. ఇప్పటికే ఎంతో డ్యామేజ్ జరిగింది.. జాగ్రత్తగా ఉండండి అంటూ బిగ్ బాస్ షోకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ను పూనమ్ జోడించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WMej2i
No comments:
Post a Comment