బాహుబలితో పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. అక్కడి నుంచి వరుసగా పాన్ సినిమాలనే ఓకే చేస్తూ వస్తున్నారు. సాహో సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం రాబట్టుకోకపోయినా, ప్రభాస్ సినిమాలకేం కొదవ లేకుండా పోయింది. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రీకరణను పూర్తి చేసిన ప్రభాస్.. సలార్, సినిమాలను సెట్స్పైకి తీసుకెళ్లిన సంగతి కూడా తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సమయంలో ప్రబాస్ తన లుక్ విషయంలో శ్రద్ధ పెట్టలేదు. ఇది ఆయనతో సినిమా చేస్తున్న నిర్మాతలకు ఇబ్బందిగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ‘ఆదిపురుష్’ నిర్మాతలు ప్రభాస్ లుక్పై టెన్షన్ పడుతున్నారట. ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్ ప్రభాస్ను రాముడిగా చూపించబోతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభాస్ లుక్ ఎలా ఉండాలో ముందుగానే చెప్పాడట. కానీ ఇప్పుడా లుక్ పోవడం, మళ్లీ ఆ లుక్ కోసం ప్రభాస్ ఇబ్బంది పడుతుండటంతో ఓంరౌత్ ప్రభాస్ను బ్రిటన్కు తీసుకెళ్లాలని భావించాడు. లుక్, ఫిజిక్ విషయంలో ప్రభాస్ కరెక్ట్గా ఉండకపోవడం అనేది సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే ప్రభాస్ బ్రిటన్ వెళ్లబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తుటే, కృతిసనన్ సీత పాత్రలో నటిస్తుంది. రాధేశ్యామ్ షూటింగ్ను పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్తో పాటు ఆదిపురుష్ను కూడా పూర్తి చేయడంపైనే తన దృష్టి పెట్టాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్లో విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరి చెప్పిన డేట్కే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా? లేక వెనక్కి వెళతారా? అని తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3A8Xc9A
No comments:
Post a Comment