Monday 20 September 2021

దృశ్యం-2 ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన చిత్ర యూనిట్.. ఆ విషయంలో వెంకీ అభిమానులకు నిరాశే

మలయాళంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో 2013 విడుదలైన థ్రిల్లర్ డ్రామ ‘దృశ్యం’ ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. ఆపదలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఓ మామూలు వ్యక్తి ఎలా కాపాడుకుంటాడూ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేయగా.. అక్కడ కూడా మంచి విజయం సాధించింది ఈ సినిమా. తెలుగులో ప్రధాన పాత్రలో దగ్గుబాటి వెంకటేష్ నటించగా.. ఆయన భార్యగా నటించారు. అయితే కొద్దిరోజుల క్రితం మలయాళంలో ఈ సినిమాకు సీక్వెల్ విడదలై.. మంచి విజయం సాధించింది. ‘’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సీక్వెల్‌ని అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తి అయింది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదాపడుతూ వచ్చింది. ఈలోపే వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాదించింది. ఇప్పుడు పరిస్థితులు మామూలు పరిస్థితికి రావడంతో.. ‘దృశ్యం-2’ సినిమాను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా.. లేక థియేటర్‌లోనా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని సోమవారం విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ‘రాంబాబు’ పాత్రలో వెంకీని చూసేందుకు ఆసక్తి ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఫస్ట్‌లుక్ విడుదలను వాయిదావేశారు. అసౌకర్యానికి చింతిస్తున్నాము అంటూ చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే మళ్లీ ఫస్ట్‌లుక్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చిత్ర యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. ఇక జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lFe81v

No comments:

Post a Comment

'Nikhil Gupta Will Be Sent Back To India'

'As the trial gets closer for Nikhil Gupta, they're going to want to make sure that he doesn't talk.' from rediff Top Inte...