దేశంలో ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగతూనే ఉంది. అయితే రికవరీ రేటు మెరుగ్గా ఉండటంతో అన్ని రాష్ట్రాలూ ఊపిరి పీల్చుకుంటున్నాయి. కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులను పట్టి పీడిస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైతం చాలామంది దీని బారిన పడ్డారు. తాజాగా కుటుంబానికి కరోనా సోకింది. తనతో పాటు భార్య జీవిత, ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడినట్లు రాజశేఖర్ సోషల్మీడియా ద్వారా ప్రకటించారు. అయితే శివాని, శివాత్మిక ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారని, తాను, జీవిత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రాజశేఖర్ శనివారం ట్వీట్ చేశారు. త్వరలోనే తామిద్దరం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తామని పేర్కొన్నారు. Also Read: కరోనా నుంచి కోలుకున్న టాలీవుడ్ ఇటీవలే షూటింగులతో బిజీగా మారింది. హీరోయిన్ తమన్నా ఇటీవలే కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. తాజాగా రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడటంతో సినీనటులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రముఖ హాస్యనటుడు కోసూరి వేణుగోపాల్ ఇటీవలే కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k7WgKK
No comments:
Post a Comment