ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ- చిరంజీవిల మధ్య జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్స్ రీ ఓపెన్ విషయమై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా సినీ పెద్దలు హాజరై చర్చలు జరిపారు. అయితే ఈ మీటింగ్కి తనను పిలవలేదని ఫైర్ అయిన .. భూములు పంచుకుంటున్నారా? అని కామెంట్ చేయడంతో ఈ ఇష్యూ చిలికి చిలికి గాలివానలా తయారైంది. దీంతో ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇంతలోనే తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలు, కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న టాలీవుడ్ తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు సినీ పెద్దలు సిద్ధం కావడం మరిన్ని చర్చలకు దారితీసింది. జూన్ 9వ తేదీన జరగనున్న ఈ సమావేశానికైనా బాలకృష్ణను పిలుస్తారా? పిలిస్తే ఆయన వస్తారా? అనే దానిపై అంతా దృష్టి సారించారు. అయితే తాజా సమాచారం జగన్తో భేటీకి బాలకృష్ణకు ఆహ్వానం అందిందట. కానీ బాలయ్య మాత్రం తాను రాలేనని తేల్చిచెబుతూ అందుకు కారణాలు వివరించారని నిర్మాత సీ కళ్యాణ్ మీడియాకు చెప్పారు. జూన్ 9న సీఎం జగన్తో జరగబోయే భేటీకి రావాలని తానే స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి ఆహ్వానించానని, అయితే అదే సమయంలో తన బర్త్ డే సెలబ్రేషన్ పనులు ఉండటంతో ఆయన రాలేనని చెప్పారని నిర్మాత సీ కళ్యాణ్ అన్నారు. తెలుగు చిత్రసీమ రెండు వర్గాలుగా విడిపోయిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇండస్ట్రీ కోసం బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. జూన్ 9న ఏపీ సీఎం జగన్తో జరగబోయే ఈ భేటీలో సీ కళ్యాణ్, సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు సహా కొందరు దర్శక నిర్మాతలు పాల్గొననున్నారని సమాచారం. మరోవైపు ఈ భేటీలో చిరంజీవి కూడా ఉంటారా? లేదా? అనేది ఆసక్తికర అంశంగా మారింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y5nJD9
No comments:
Post a Comment