Sunday 22 December 2019

బాగా పుంజుకున్న ‘ప్రతిరోజూ పండగే’ కలెక్షన్స్: డే1 కన్నా డే3 అధికం

ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసిన సినిమా విడుదలవుతుంది అంటే అందరి దృష్టి తొలిరోజు వసూళ్లపైనే ఉంటుంది. చిత్ర నిర్మాతలు కూడా ఓపెనింగ్ డే కలెక్షన్స్‌నే టార్గెట్ చేస్తారు. ఆ రోజు వీలైనంత ఎక్కువ రాబట్టాలనే చూస్తారు. ఒకవేళ సినిమా బాగాలేకపోయినా తొలిరోజు కలెక్షన్స్ కాస్త కాపడతాయనే ధైర్యం ఉంటుంది. ఒకవేళ ఓపెనింగ్ డే కన్నా ఆ తరవాత రోజుల్లో కలెక్షన్లు పుంజుకుంటే ఇక ఆ సినిమాకు తిరుగుండదు. ప్రస్తుతం ‘ప్రతిరోజూ పండగే’ విషయంలో అదే జరుగుతోంది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే, ఓపెనింగ్స్ మాత్రం గొప్పగా రాలేదు. కానీ, సినిమా అయితే హిట్ అనే టాక్ మాత్రం జనాల్లోకి వెళ్లిపోయింది. అందుకే, ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ పుంజుకున్నాయి. మూడో రోజైన ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శితమవుతోన్న థియేటర్లన్నీ ఇంచుమించుగా హౌస్‌ఫుల్ అయిపోయాయి. దీంతో తొలిరోజు కన్నా మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు వస్తాయని అంటున్నారు విశ్లేషకులు. Also Read: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.5.6 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని సమాచారం. గ్రాస్ రూ.15 కోట్ల వరకు ఉందని అంటున్నారు. మూడో రోజు కలెక్షన్లు బాగా పుంజుకున్నాయి కాబట్టి.. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల వరకు షేర్ రాబట్టడం ఖాయమని చెబుతున్నారు. తొలి రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల వారీగా షేర్ వివరాలు ఇలా ఉన్నాయి (అంచనా).. నైజాం - రూ. 2.45 కోట్లు సీడెడ్ - రూ. 66 లక్షలు నెల్లూరు - రూ. 24 లక్షలు కృష్ణ - రూ. 37 లక్షలు గుంటూరు - రూ. 45 లక్షలు వైజాగ్ - రూ. 62 లక్షలు తూర్పుగోదావరి - రూ. 47 లక్షలు పశ్చిమ గోదావరి - రూ. 34 లక్షలు మొత్తం ఏపీ, టీఎస్ షేర్ - రూ. 5.60 కోట్లు


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2saLvBD

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...