Sunday, 29 December 2019

కమెడియన్ నుంచి హీరో.. ఇప్పుడు విలన్.. సునీల్ కొత్త ప్రయత్నం

హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు సునీల్. టాలీవుడ్‌లో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన సునీల్.. ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగానూ తన మార్క్‌ను చూపించారు సునీల్. అయితే, ‘మర్యాద రామన్న’ తరవాత సునీల్ హీరోగా చాలా సినిమాలే చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన బాగా వెనకబడిపోయారు. ఇటు హీరోగా రాణించలేక, అటు కమెడియన్‌గా అవకాశాలు లేక సునీల్ కెరీర్ పరంగా చాలా ఇబ్బందిపడ్డారు. మొత్తానికి తన మిత్రుడు, దర్శకుడు తివిక్రమ్ సాయంతో ‘అరవింద సమేత’ సినిమాతో మళ్లీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే, ఇన్నిరోజులూ కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు. ఈమేరకు ఆయన విలన్‌గా ఒక కొత్త సినిమాను అంగీకరించారు. ఈ సినిమా ద్వారా యంగ్ కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. ‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ చిత్రాలను నిర్మించిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం ‘కలర్ ఫోటో’లో సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. ‘మజిలీ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరీ హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే ‘మత్తు వదలరా’ సినిమాతో సక్సెస్ అందుకున్న యం.యం.కీరవాణి కుమారుడు కాల భైరవ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం 1995లో ఒక ఇంజనీరింగ్ కాలేజిలో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/365IXmY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....