Saturday, 28 December 2019

నయనతార, తాప్సీల బాటలో సమంత

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత. పెళ్లి తరువాత ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ సినిమా తరువాత సమంత చేయబోయే సినిమా ఇంకా కన్‌ఫార్మ్‌ కాలేదు. అయితే సామ్‌ కొద్ది రోజులు బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. 96 రీమేక్‌ తరువాత మరోసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సమంత ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. థ్రిల్లర్‌ జానర్‌లో లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించే తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ సమంత ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. Also Read: నయనతార ప్రధాన పాత్రలో మాయ, తాప్సీ లీడ్‌ రోల్‌లో గేమ్‌ ఓవర్ సినిమాలను తెరకెక్కించిన అశ్విన్‌.. సమంతతోనూ అదే జానర్‌లో ఓ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సమంతకు కథకూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. అశ్విన్ చెప్పిన కథ నచ్చటంతో ఈ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పేసినట్టుగా తెలుస్తోంది. See Photo Story: ఇప్పటికే 96 రీమేక్‌ షూటింగ్ పూర్తయ్యింది. తమిళ్‌లో త్రిష నటించిన జాను పాత్రను తెలుగులో సమంత పోషిస్తోంది. తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగు వర్షన్‌ను కూడా డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంతకు జోడిగా శర్వానంద్‌ నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tYUtT6

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...