Saturday 25 September 2021

‘మహాసముద్రం’పై పాన్ ఇండియా స్టార్ మద్దతు.. అదిరిపోయింది అంటూ పోస్ట్ పెట్టిన ప్రభాస్

తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 100’తోనే తన సత్తా నిరూపించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. , సిద్ధార్త్ హీరోలుగా ఆయన ‘మహాసముద్రం’ అనే సినిమాని రూపొందిస్తున్నారు. రొటీన్ సినిమాల్లా కాకుండా ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుకగా సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది. ట్రైలర్‌లోని సన్నివేశాలు.. యాక్షన్ సీన్లు.. డైలాగ్స్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాతో శర్వానంద్, సిద్ధార్త్‌లకు సూపర్‌హిట్ గ్యారెంటీ అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు పాన్ ఇండియా స్టార్ మద్దతు లభించింది. శర్వానంద్ మరియు ప్రభాస్‌లు మంచి మిత్రులు అనే విషయం ఎప్పటి నుంచి తెలిసిందే. ప్రభాస్‌ని ప్రేమతో శర్వానంద్ ‘అన్న’ అని సంభోదిస్తుంటారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌పై ప్రభాస్ కామెంట్ చేశారు. ట్రైలర్ చాలా అద్భుతంగా, ఆసక్తికరంగా ఉంది అంటూ ఆయన పేర్కొన్నారు.ఈ సినిమా సూపర్ హిట్ కావాలి అంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆయన విషెస్ తెలిపారు. ఈ పోస్ట్‌పై శర్వానంద్ కూడా రియాక్ట్ అయ్యారు. ‘థాంక్స్ అన్న’ అంటూ ఈ పోస్ట్‌కి ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యయేల్‌లు హీరోయిన్‌లుగా నటిస్తుండగా.. రావు రమేష్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. తెలుగుతో పాటు తమిళ భాషలో కూడా ఈ సినిమా విడుదల అవుతున్నట్లు సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CNP7If

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...