Tuesday, 26 January 2021

'అర్ధ శతాబ్దం' టీజర్: న్యాయం ధర్మం అవుతుంది గానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు!!

కెరీర్ పరంగా విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటుడు ఈ సారి 'అర్ధ శతాబ్దం' అంటూ మరో వైవిద్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ వంటి దిగ్గజ నటులు భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు చిట్టి కిరణ్ రామోజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవ‌ల దగ్గుబాటి రానా ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ రిలీజ్ చేయగా, తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఒక నిమిషం ఏడు సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో చూపించిన అన్ని సన్నివేశాలు, ముఖ్యంగా రోమాలు నిక్కబొడిచేలా ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ''న్యాయం ధర్మం అవుతుంది గానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు.. యుద్ధమే ధర్మం కానప్పుడు ధర్మ యుద్ధాలెక్కడివి. ఈ స్వతంత్ర దేశంలో గణతంత్రం ఎవడికో, ఎందుకో, దేనికో.. ఈ విశాల భారతానికి అఖండ రాజ్యాంగం'' అనే డైలాగ్స్ ఈ టీజర్‌లో వినొచ్చు. మొత్తంగా ఈ టీజర్ చూస్తుంటే నవీన్ చంద్ర కెరీర్‌కి ఈ 'అర్ధ శతాబ్దం' సినిమా బాగానే ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ అతిత్వరలో విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pmg8MG

No comments:

Post a Comment

'Consumers should not pay higher taxes for clean tech'

'We are not asking for incentives, but at least taxation can be aligned such that the rupee tax on consumers remains the same.' fr...