Monday 15 June 2020

ఈ టైమ్‌లో అలాంటివి వద్దు.. లవ్ యు గ‌య్స్ అంటూ మ్యాటర్ చెప్పేసిన త్రిష

టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో సెలబ్రిటీలంతా సోషల్ మీడియా బాట పడుతుంటే అందుకు భిన్నమైన రూట్ ఎంచుకుంది అందాల తార . గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ తన సినిమా విశేషాలు, హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ సడెన్‌గా ఓ నిర్ణయం తీసుకుంది. నుండి కాస్త బ్రేక్ తీసుకోబోతున్నానని, ఇకపై కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని పేర్కొంటూ షాకింగ్ ట్వీట్ పెట్టింది. ''ప్ర‌స్తుతానికి నా చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతుందో తెలియకుంటేనే మంచిదని అనుకుంటున్నా. మన మ‌న‌సుకు ఇది డిజిట‌ల్ చికిత్స‌లాంటిది అని భావిస్తున్నా. లవ్ యు గ‌య్స్‌.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ క‌లుద్దాం'' అని తెలుపుతూ తన ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ పెట్టింది త్రిష. ఈ మేరకు 'స్టే హోమ్ స్టే సేఫ్' అని ట్యాగ్ చేస్తూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే హింట్ ఇచ్చింది. ఆమె చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీ రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Also Read: అందం, దానికి తగ్గ అభినయంతో ఆకట్టుకోవడంలో త్రిష సక్సెస్ అయింది. తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ కేటగిరీలో నిలిచింది. ఇటు కుర్ర హీరోలు, అటు వెటరన్ స్టార్స్‌ అందరితోనూ జతకట్టి రెండు తరాల ప్రేక్షకులకు అభిమాన తారగా క్రెడిట్ కొట్టేసింది. కాగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో ఛాన్స్ వచ్చినా వదులుకొని షాకిచ్చిన త్రిష.. సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నా అంటూ మరో షాకిచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30Lge73

No comments:

Post a Comment

BJP MLA Fights BJP Govt On Corruption

'I gave enough evidence and proof to punish corrupt officials.' from rediff Top Interviews https://ift.tt/4th0uJC