Sunday, 1 December 2019

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి రేపు ‘మైండ్ బ్లాక్’

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కి సోమవారం నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ సందడి మొదలైపోతుంది. ‘మాస్ ఎంబీ మహేష్’ పేరిట ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్ కొత్తరకం ప్రచారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ మొదటి సోమవారం నుంచి ఐదు సోమవారాల్లో ఐదు పాటలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ సమయం ఆసన్నమైంది. రేపే మొదటి సోమవారం. ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి తొలి పాట వచ్చేస్తోంది. ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే మంచి మాస్ సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. ఈ పాట లిరికల్ వీడియోను రేపు సాయంత్రం 5.04 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. కాగా, మహేష్‌ బాబు ఈ సినిమాలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. Also Read: ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y4LSsU

No comments:

Post a Comment

'Child Marriage Is Nothing But Child Rape'

'People don't believe that a 15-year-old girl subjected to sexual intercourse within a marriage is a victim of rape.' from red...