Sunday, 8 November 2020

‘పుష్ప’ అప్‌డేట్.. మారేడుమిల్లి బయలుదేరిన బన్నీ!

క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ చేస్తోన్న ‘పుష్ప’ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ మూడోసారి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అని ప్రకటించినప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. ‘రంగస్థలం’ లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించిన సుకుమార్.. ఇప్పుడు బన్నీతో ఎలాంటి జానర్‌లో మూవీ చేయబోతున్నారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. మొత్తానికి ఈ ఏడాది ఏప్రిల్ 8న చిత్ర టైటిల్‌ను, బన్నీ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘పుష్ప’ అనే టైటిల్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించగానే అల్లు అర్జున్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. అదే విధంగా బన్నీ లుక్ కూడా చాలా రఫ్‌గా ఉండటం, ఆయన ఎడమ కాలికి ఆరు వేళ్లు ఉండటం వంటి ప్రత్యేక అంశాలు సినిమాపై ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాలో బన్నీ గందపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించనున్నారనే విషయం కూడా చర్చనీయాంశం అయ్యింది. అయితే, ఫస్ట్ లుక్ విడుదల చేసిన తరవాత కరోనా మహమ్మారి వల్ల ఇప్పటి వరకు సుమారు ఎనిమిది నెలల పాటు ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. Also Read: ‘పుష్ప’ షూటింగ్‌పై రకరకాల వదంతులు ఈ ఎనిమిది నెలల కాలంలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఎప్పుడు, ఎక్కడ మొదలుపెడతారో తెలుసుకోవడానికి బన్నీ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ వినిపించింది. ‘పుష్ప’ ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్ అప్‌డేట్‌కు సంబంధించి రేపు (నవంబర్ 9న) ఉదయం 10 గంటలకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని మైత్రీ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మొత్తానికి ఎనిమిది నెలల తరవాత బన్నీ ముఖానికి రంగు వేసుకోబోతున్నారు. ఇదిలా ఉంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను చాలా వరకు అటవీ ప్రాంతంలో చిత్రీకరించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీని కోసం చాలా అటవీ ప్రాంతాలను పరిశీలించిన సుకుమార్.. చివరికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు, మారేడుమిల్లిలోని ఒక ఫారెస్ట్ రిసార్ట్‌ను కూడా అద్దెకు తీసుకున్నారని అన్నారు. బన్నీతో పాటు మిగిలిన నటీనటులు అక్కడే ఉండి ఈ షెడ్యూల్‌ను పూర్తి చేస్తారని టాక్. నవంబర్ 10 నుంచి షూటింగ్ మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు, బన్నీ కూడా ఆదివారం రాజమండ్రికి పయనమయ్యారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన కెమెరా కంటికి చిక్కారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3la1tCr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....