Sunday, 8 November 2020

కాదంబరి కిరణ్‌కు రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న పురస్కారం

‘మనం సైతం’ సేవా సంస్థ ద్వారా నటుడు పేదలను ఆదుకుంటున్నారు. చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లకు చెందిన వారితో పాటు సంస్థ సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు. కాదంబరి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ ఏడాది ‘రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న’ పురస్కారం దక్కింది. అక్టోబర్ 31న ప్రకటించిన ఈ పురస్కారం ఆదివారం (నవంబర్ 8న) ఆయనకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ‘ది గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్’ ఈ ‘రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న’ పురస్కారాన్ని కళలు, సామాజిక సేవ, వైద్య, వ్యాపారం వంటి రంగాల్లో ఏటా అందిస్తోంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి కాదంబరి కిరణ్‌ను సేవా విభాగంలో ఎంపిక చేశారు. పురస్కారం అందుకున్న సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ‘‘మనం సైతం సేవా సంస్థ ద్వారా వేలాది మందికి సహాయం చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ సేవా కార్యక్రమాలకు రాష్ట్రీయ సమాజ్ సేవా రత్న పురస్కారం దక్కడం నిజంగా ప్రోత్సాహకరం. నా సేవకు దొరికిన గుర్తింపుగా భావిస్తున్నాను. వినయంగా అవార్డును స్వీకరిస్తున్నాను. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా, ఎవరికైనా మనం సైతం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా’’ అని అన్నారు. కాగా, కాదంబరి కిరణ్ రెండు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో నటుడిగా ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. చాలా హాస్యాన్ని పండించే పాత్రలు చేశారాయన. అప్పటి నుంచి ప్రతి ఏటా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వస్తున్నారు. కాదంబరి ఫౌండేషన్‌ను స్థాపించి తన సంపాదనలో కొంత సమాజ సేవకు వాడుతున్నారు. కరోనా సమయంలోనూ తన సంస్థ ద్వారా పేదలకు ఆయన సహాయం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kc6x7I

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....