Sunday, 8 November 2020

కాజల్ హనీమూన్.. బీచ్ దగ్గర హొయలొలికిస్తున్న బ్యూటీ

స్టార్ హీరోయిన్ అగర్వాల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఆమె వివాహమాడారు. మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న కాజల్, గౌతమ్.. అక్టోబర్ 30న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇటీవలే భర్తతో కలిసి కర్వా చౌత్ కూడా జరుపుకున్నారు కాజల్. అయితే, ప్రస్తుతం భర్తతో కలిసి మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు మాల్దీవులులో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను కాజల్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో కాజల్ ఎరుపు రంగు పూల గౌనులో మెరిసిపోతున్నారు. అంతేకాదు తన చర్మ సౌందర్యాన్ని కూడా ప్రదర్శించారు. సముద్రం ఒడ్డున నిలబడి కాజల్ తీసుకున్న ఈ ఫొటోలు చాలా అందంగా ఉన్నాయి. ముఖ్యంగా మాల్దీవులు ప్రకృతి అందాలు మెస్మరైజ్ చేస్తున్నాయి. కొన్‌రాడ్ మాల్దీవ్స్ రంగలి ఐల్యాండ్‌లో ఉన్న లగ్జరీ రిసార్ట్స్‌లో ప్రస్తుతం కాజల్, గౌతమ్ కిచ్లు ఉన్నారు. మరికొద్ది రోజులు వీరు అక్కడే గడపనున్నారు. హనీమూన్ తరవాత కాజల్ మళ్లీ సినిమా షూటింగ్స్‌లో పాల్గోనున్నారు. ప్రస్తుతం కాజల్ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’లో కాజల్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రేపటి (నవంబర్ 9) నుంచి మొదలవుతోంది. త్వరలోనే కాజల్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈ సినిమాతో పాటు ‘మోసగాళ్ళు’, ‘ఇండియన్ 2’, ‘ముంబై సాగ’ చిత్రాల్లో కాజల్ నటిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3598VrA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....