బిగ్ బాస్ సీజన్ 4 నుంచి ‘అమ్మ’ ఎలిమినేట్ అయ్యారు. నోయల్ స్పెషల్ రిక్వెస్ట్తో గతవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న రాజశేఖర్ మాస్టర్ ఈవారం ఇంట్లో నుంచి బయటికి వచ్చేశారు. నేటి (నవంబర్ 8) ఎపిసోడ్లో ప్రేక్షకులు ఇదే చూడనున్నారు. అయితే, ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో నేడు చూస్తారు. అయితే, ప్రేక్షకులకు ఇది సర్ప్రైజ్ మాత్రం కాదు. ఎందుకంటే, రాజశేఖర్ గతవారమే వెళ్లిపోతారని అంతా భావించారు. కానీ, నాగార్జున ఆఖర్లో ట్విస్ట్ ఇవ్వడంతో అంతా అవాక్కయ్యారు. ఎనిమిదో వారం నామినేషన్కు ‘అమ్మ’ రాజశేఖర్, అఖిల్, మోనాల్, అరియానా గ్లోరి, లాస్య, మెహబూబ్లు నామినేట్ అయ్యారు. వీరిలో చివరికి రాజశేఖర్, మెహబూబ్ మిగలడంతో ఇద్దరినీ కన్ఫెషన్ రూంలోకి పంపి డ్రామా నడిపారు. వీరిద్దరిలో ఎవరు హౌస్లో ఉండాలని హౌస్మేట్స్తో ఓట్లు వేయించారు హోస్ట్ నాగార్జున. ఎక్కువ మంది మెహబూబ్నే కోరుకున్నారు. రాజశేఖర్ను ఇంట్లో నుంచి పంపేయమన్నారు. వాళ్ల కోరిక ఈ వారం తీరింది. తొమ్మిదో వారం ఎలిమినేషన్కు అభిజిత్, హారిక, మోనాల్, అమ్మ రాజశేఖర్, అవినాష్ నామినేట్ అయ్యారు. వీళ్లలో శనివారం నాటి ఎపిసోడ్లో హారిక సేవ్ అయ్యింది. ఇక ఈరోజు అభిజిత్, మోనాల్, అవినాష్లు సేవ్ అయ్యి రాజశేఖర్ ఎలిమినేట్ అవుతారు. ఇదే నేటి ఎపిసోడ్లో ప్రేక్షకులు చూడబోతున్నారు. అమ్మ రాజశేఖర్ ఎలిమినేషన్తో ఇంట్లో పంచాయతీ పూర్తయినట్టే. గత బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమ్మ రాజశేఖర్ను ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kaTMub
No comments:
Post a Comment