‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంతప్ నంది ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 2010లో విడుదలైన ఈ చిత్రం నవంబర్ 12తో పదేళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు దర్శకుడు సంపత్ నంది. అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవం కూడా లేని తనను దర్శకుడిగా పరిచయం చేసిన నిర్మాత కె.కె. రాధామోహన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆయనకి రుణపడి ఉంటానని అన్నారు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ఏమైంది ఈవేళ’ సినిమా నిజానికి చాలా బాగుంటుంది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా కమర్షియల్గా ఆడలేదు. దీనికి గల కారణాలను నిర్మాత కె.కె. రాధామోహన్ ట్విట్టర్ ద్వారా ప్రస్తావించారు. సంపత్ నంది ట్వీట్కు రిప్లై ఇస్తూ తమ సినిమా గొప్పతనాన్ని చెప్పారు. ఇలాంటి సినిమాను నిర్మించడానికి నమ్మకం ఉండాలన్నారు. తమ సినిమా ట్రెండ్ సెట్టర్ అని గర్వంగా చెప్పారు. గోకుల్ థియేటర్కు వచ్చిన దర్శకుడు సుకుమార్ మీడియాతో మాట్లాడటాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. Also Read: ఇక తమ సినిమా ఎక్కువ రోజులు ఆడకపోవడం గురించి చెబుతూ.. ‘‘కళ్యాణ్ రామ్ కత్తి అదేరోజు విడుదలైంది. ఆ పోటీని మా సినిమా తట్టుకుంది. తొలి వారం అన్ని షోలు హౌస్ఫుల్ కావడంతో గోకుల్ థియేటర్ ఓనర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, ‘మగధీర’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత వచ్చిన సినిమా ‘ఆరెంజ్’ మా సినిమా డ్రీమ్ రన్ను దెబ్బకొట్టింది. మా సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆ చిత్రం వచ్చింది’’ అని పేర్కొన్నారు. నవంబర్ 26న ‘ఆరెంజ్’ విడుదలైంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36b3kk0
No comments:
Post a Comment