సీనియర్ యాంకర్ ఉదయభానుకు ఒకప్పుడు బోలెడంత ఫాలోయింగ్. ఆమె కోసం కుర్రాళ్లు పడిచచ్చిపోయేవారు. ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘డాన్స్ బేబీ డాన్స్’, ‘పిల్లలు పిడుగులు’ లాంటి ఎన్నో టీవీ కార్యక్రమాలతో ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. సినిమాల్లో కూడా మెరిశారు. కెరీర్ మంచి పీక్లో ఉన్న సమయంలో అంటే 2004లో విజయ్ కుమార్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరవాత కూడా తన ప్రొఫెషన్ను కొనసాగించారు. అయితే, 2016 ఆగస్టులో ఉదయభాను కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు. పిల్లలు భూమి ఆరాధ్య, యువి నక్షత్ర పుట్టిన తరవాత ఉదయభాను పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. సుధీర్ఘ విరామం తరవాత ఇటీవల మళ్లీ బుల్లితెరపై ఆమె రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఉదయభాను ఫుల్ బిజీగా ఉన్నారు. రియాలిటీ గేమ్ షో ‘కళ్యాణ లక్ష్మి’కి వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. అలాగే, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న కామెడీ షో ‘జూలకటక’కు జడ్జిగానూ కొనసాగుతున్నారు. అలాగే, మూవీ ఈవెంట్లు కూడా చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. Also Read: వరుస షోలతో బాగానే సంపాదిస్తోన్న ఉదయభాను తాజాగా ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇద్దరు పిల్లలు, భర్తతో కారు డెలివరీ సమయంలో తీసుకున్న ఫొటో తాజాగా బయటికి వచ్చింది. ఉదయభాను కారు కొనడంలో వింతేముంది అని చాలా మందికి అనిపించొచ్చు.. కానీ, ఆమె కొన్నది సాదాసీదా కారు కాదు.. లగ్జరీ కారు. అందుకే, ఇది ప్రత్యేకం. సినీ తారలు ఖరీదైన లగ్జరీ కార్లు కొనడం సర్వసాధారణమే. అయితే, ఈ మధ్య కాలంలో యాంకర్లు, సింగర్లు, హీరోల అసిస్టెంట్లు కూడా బెంజ్ లాంటి ఖరీదైన లగ్జరీ కార్లు కొనడం ఆసక్తికరం. ఇటీవలే ప్రముఖ బుల్లితెర యాంకర్ మంజూష బెంజ్ కారు కొనుగోలు చేశారు. అలాగే, హీరో సుందీప్ కిషన్ అసిస్టెంట్, ‘నిను వీడని నీడను నేనే’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివ చెర్రీ మెర్సిడెస్ బెంజ్ హైక్లాస్ కారును కొనుగోలు చేశారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సైతం తనకొచ్చిన ప్రైజ్ మనీతో బెంజ్ కారును సొంతం చేసుకున్నారు. అందకే, ఇప్పుడు ఉదయభాను కూడా బెంజ్ కారుకు ఓనర్ కావడం ప్రత్యేకత సంతరించుకుంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wmflox
No comments:
Post a Comment