Thursday, 27 February 2020

టీఎస్‌ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ పైరసీ.. రియాక్ట్ అయిన కేటీఆర్

వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీష్మ’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రష్మిక మందన కథనాయికగా నటించారు. వారం రోజుల్లోనే 50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే పైరసీ కాపీలు వచ్చేసాయి. పైగా ఆ పైరసీ కాపీని టీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్లే చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని నిఖిల్ అనే నెటిజన్ దర్శకుడు వెంకీ కుడుములకు తెలియజేసాడు. ‘‘తెలంగాణ ఆర్టీసీ బస్సులో భీష్మ పైరసీని ప్లే చేసారు. వెంకీ కుడుముల, నితిన్ వెంటనే వీరిపై యాక్షన్ తీసుకోండి’ అంటూ ఆ బస్సు నెంబర్‌తో సహా ఫొటోలను షేర్ చేసాడు. దీనిపై వెంకీ కుడుముల స్పందిస్తూ.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసారు. ‘నా టీం పైరసీలు అవ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సుల్లో పైరసీ సినిమాలను ప్లే చేస్తే వెంటనే వారిని ప్రశ్నించండి. వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి. సినిమాలు తీయడానికి మేమెంతో డబ్బు పెట్టి కష్టపడుతుంటాం. మా సినిమా అనే కాదు ఏ సినిమాను కూడా పైరసీ చేయనివ్వకండి. గురించి నాకు తెలిసేలా చేసిన వ్యక్తికి ధన్యవాదాలు. టీఎస్‌ఆర్టీసీ బస్సులో పైరసీ మూవీని ప్లే చేయడం బాధాకరం. కేటీఆర్ సర్ మాకు ఏ సమస్య వచ్చిన ట్యాగ్ చెయ్యాలనిపించే ఒకే ఒక్క ఐడీ మీది’ అని ట్వీట్ చేసారు. READ ALSO: దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ‘నేను ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. పైరసీని అంతమొందిచే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను’ అని హామీ ఇచ్చారు. ఈ ట్వీట్ చూడగానే యువ నటుడు నిఖిల్ కూడా తన బాధను చెప్పుకున్నాడు. నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా పైరసీ వీడియోను కూడా చాలా బస్సుల్లో ప్లే చేసారు. ఈ విషయం గురించి నిఖిల్ ట్వీట్ చేస్తూ దయచేసి పైరసీ ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3c9SiOd

No comments:

Post a Comment

'Paatal Lok Is Sacred To Me'

'I was feeding off the bond that Ansari and Hathiram had formed during season one.' from rediff Top Interviews https://ift.tt/k435...