Monday, 24 February 2020

ట్రంప్ ఖుష్ అవ్వాలంటే రాజమౌళి రంగంలోకి దిగాల్సిందేనట: వర్మ సలహా

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఇక్కడికి వచ్చేముందు ఆయన్ను సాదరంగా ఆహ్వానించడానికి కోటి మంది వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆగ్రాలోని మొటేరా స్టేడియంలో ఏర్పాటుచేసిన నమస్తే ట్రంప్ ఈవెంట్‌కు లక్ష మంది మాత్రమే వచ్చారు. వారిలో చాలా మంది ట్రంప్ మాస్క్‌లు వేసుకుని వచ్చారు. దీనిపై దర్శకుడు కామెంట్ చేస్తూ.. మరోసారి దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళిని ఇరికించారు. ‘‘మన ప్రధాని మోదీ ట్రంప్‌ని ఆహ్వానించడానికి కోటి మంది వస్తారని చెప్పి కవ్వించారు. కానీ వచ్చింది మాత్రం లక్ష మందే. ఇది చూసి ట్రంప్ హర్ట్ అవ్వకూడదని, ఆ బాధలో మనకు రావాల్సిన ఒప్పందాలు రద్దు చేయకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రంప్ పగ తీర్చుకునే టైప్. అయితే ట్రంప్‌ ఎంత మంది వచ్చరో లెక్క పెట్టలేరు కాబట్టి లక్ష మందిని చూసి కోటి మంది వచ్చి ఉంటారని అనుకుంటే మనం బతికిపోతాం. ట్రంప్ రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తే బాగుంటుంది. రాజమౌళి తన ప్రతిభను కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లక్ష మందిని కాస్తా కటి మందిగా చూపించి ఆ వీడియోను ట్రంప్‌కు కానుకగా ఇస్తే బాగుంటుంది’ అని సెటైర్లు పేలుస్తూ ట్వీట్లు చేసారు. ట్రంప్ వస్తు్న్నారని అహ్మదాబాద్ మొత్తం క్లీన్‌ చేసేసారు. రంగులు వేయడం, రకరకాల చెట్లు పెట్టడం లాంటివి చేసారు. అయితే రామ్ గోపాల్ వర్మ దీనిపై సెటైర్ వేస్తూ గుండె బరువెక్కించే ఫొటో ఒకటి పోస్ట్ చేసారు. ఓ రోడ్డునైతే ట్రంప్ కోసం అందంగా మార్చారో అదే రోడ్డు పక్కన పేదలు గుడిసెల్లో బతుకుతూ కనిపించారు. ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ ట్రంప్‌కు కనిపించేది ఈ అందమైన ప్రదేశం మాత్రమే పక్కనున్న పేదల కష్టాలు కావు అని పెట్టారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TarVyQ

No comments:

Post a Comment

When Saif Ali Khan Was 'Homeless And Penniless'

'One day, I was working in my office late in the evening when suddenly the peon comes and says Saif Ali Khan has come to meet you.' ...