Monday, 17 February 2020

ఆ రివ్యూలు చూస్తే బూతులొస్తున్నాయ్: దర్శకుడి ఆవేదన

తన సినిమాను ఎవరో కావాలనే దెబ్బకొట్టాలని చూసారంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసారు దర్శకుడు . ఆయన తెరకెక్కించిన ‘లైఫ్ అనుభవించు రాజా’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఆరోజు మంచి రివ్యూలే అందుకున్న సినిమా శనివారం కల్లా మారిపోయిందని, సోమవారానికి వెరిఫైడ్ రివ్యూలన్నీ ఎవరో డిలీట్ చేసి నెగిటివ్ రివ్యూ ఇచ్చారని అంటున్నారు. ‘‘మనం సినిమాలు తీయడం మొదలుపెట్టి వందేళ్లు అవుతోంది. ఇప్పుడు ఎవడో బ్రిటిష్ వాడు వచ్చాడు. వాడేమంటాడంటే.. నేను వ్యాపారం చేసుకుంటా అన్నాడు. వాడి వ్యాపారం వాడు చూసుకోకుండా ఇప్పుడు నువ్వు డబ్బులు పెడితే నీ సినిమా విలువ పెరుగుతుంది అంటున్నాడు. ఆదివారం రాత్రి బుక్ మై షో యాప్‌లో నేను తెరకెక్కించిన ‘లైఫ్ అనుభవించు రాజా’ సినిమాకు 73 శాతం రేటింగ్ ఉంది. అంటే ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎనిమిది షోలు చూసిన ఆడియన్స్ అంతా బాగుందనే చెప్పారు. నిన్న రాత్రి 11 గంటలకు బుక్ మై షోలో సినిమా రేటింగ్‌ను ఇరవై శాతానికి పడేసారు. తిట్టాలంటే బూతులు వస్తున్నాయ్. బూతులు నేను మాట్లాడలేను. ఎందుకంటే అది మన కల్చర్ కాదు. ఏడుపొస్తోంది కానీ మీ ముందు ఏడవలేను’’ READ ALSO: ‘‘నిన్న వెరిఫైడ్ రివ్యూలు 50కి పైగా ఉన్నాయి. ఈరోజు ఒక్కటి కూడా వెరిఫైడ్ రివ్యూ లేదు. ఆ రివ్యూలన్నీ డిలీట్ చేసేసారు. చిన్న సినిమాలన్నీ ఆదివారం రోజు నుంచే పుంజుకుంటాయి. అలాంటిది శనివారం రాత్రికే తప్పుడు రివ్యూలు పెట్టేస్తే ఎవడు టికెట్లు బుక్ చేసుకుంటాడు? మా సినిమాను చంపేయాలని ఓ వ్యక్తో లేక ఓ సంస్థో ప్రయత్నించారంటే అప్పుడే మేం గెలిచేసాం. ఇది ఆడియన్స్ తప్పు కానేకాదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఆడియన్స్‌కి సినిమా నచ్చిందో లేదో రెండు రోజుల్లో తేలిపోతుంది. కానీ అప్పటివరకు సినిమా బాగుంది అని రేటింగ్ ఇచ్చినప్పుడు.. ఆ తర్వాతి రోజు ఎందుకు పడిపోతుంది. కాబట్టి మా సినిమాను ఎవరో టార్గెట్ చేసి ఇలా చేసారు అనిపిస్తోంది’’


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39LPRzs

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....