Friday 21 February 2020

హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయడంకాదు.. శంకర్‌పై పెద్దాయన ఆగ్రహం

దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘’ సెట్‌లో రెండు రోజుల క్రితం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మొన్న రాత్రి చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్‌లో భారీ క్రేన్ కుప్పకూలింది. దాంతో ‘భారతీయుడు 2’ సినిమా కోసం పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మెన్ అక్కడికక్కడే చనిపోయారు. కాజల్ అగర్వాల్, కమల్ హాసన్, శంకర్ వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. శంకర్ కాలు విరిగిందని తెలుస్తోంది. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బాధిత కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించారు. ఇది కేవలం ఆ కుటుంబాలు కోలుకోవడానికి ఇస్తున్న నష్టపరిహారమేనని, ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని అన్నారు. అయితే ఇది కేవలం తన బాధ్యత కాదని, చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర సెలబ్రిటీలు కూడా సాయం చేస్తే బాగుంటుందని కమల్ తన మనసులో మాటను బయటపెట్టారు. READ ALSO: అయితే ఈ ఘటనపై సినీ నటుడు, తమిళనాడు డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవి స్పందిస్తూ దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు. హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయగానే సరిపోదని, సెట్‌లో ఉన్నవారికి రక్షణ కల్పించాలని అన్నారు. ‘శంకర్ హాలీవుడ్ రేంజ్‌లో సినిమాలు తీయాలని అనుకుంటాడు. కానీ సినిమాల కోసం పనిచేస్తున్నవారి రక్షణ గురించి మాత్రం పట్టించుకోడు’ అన్నారు. మరోపక్క చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు సాయం చేసిన కమల్ హాసన్‌ను రాధా రవి ప్రశంసించారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2vTC1MI

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...