Thursday, 6 February 2020

Allu Arjun: ‘అల వైకుంఠపురములో’ సీక్వెల్.. ఏంటి అప్పుడే?

స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్. బన్నీ కెరీర్‌లో బ్లా్క్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకు సీక్వెల్ రాబోతోందట. ఈ సినిమాను కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బన్నీ తన తండ్రి అల్లు అరవింద్‌తో సీక్వెల్ గురించి చర్చించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ గుసగుసలు ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ సీక్వెల్ తీయబోతున్న విషయం నిజమే అయితే ‘అల వైకుంఠపురములో’ రికార్డులను తిరగరాసేలా ఉండాలి. ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ అన్నారు. సీక్వెల్ దీనికి రంకు మొగుడిలా ఉండాలి. అప్పుడే బన్నీ మరో ల్యాండ్‌మార్క్‌ను చేరుకోగలుగుతారు. ‘అల వైకుంఠపురములో’ హిట్ అయిందన్న ఒక్క కారణంతోనే సీక్వెల్ తీసేస్తే మాత్రం అంచనాలు అందుకునే అవకాశం ఉండదు. ఒకవేళ సీక్వెల్ తీయాలని అనుకున్నా కూడా అది ఇప్పుడిప్పుడే జరగదనుకోండి. ఎందుకంటే ప్రస్తుతం బన్నీ చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి సుకుమార్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. మరొకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసేశారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయితే కానీ బన్నీ తన మూడో సినిమాను ప్రకటించలేరు. READ ALSO: ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ డిజాస్టర్ తర్వాత బన్నీ తన తర్వాతి సినిమాను ఆచి తూచి ఎంపిక చేసుకున్నారు. అలా ‘అల వైకుంఠపురములో’ సినిమాను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా కోసం ఏడాదిన్నర కష్టపడిన బన్నీకి తగిన ప్రతిఫలమే దక్కింది. కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయే సంక్రాంతి ట్రీట్ ఇచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2S3aIYT

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....