Saturday, 19 June 2021

Mahesh Babu : మిల్కా సింగ్ మరణం.. సెలెబ్రిటీల సంతాపం.. మహేష్ బాబు అలా బాలయ్య ఇలా!

భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ (92) ఇకలేరు. మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. మహమ్మారితో పోరాడి ఓడారు. రెండు రోజుల క్రితం కరోనా నెగటివ్ రావడంతో అతడ్ని ఐసీయూ నుంచి తరలించారు. కానీ ఇతర సమస్యల కా ‘నాన్న ఇప్పుడే చనిపోయాడు’ అని కొడుకు జీవ్ మిల్కా సింగ్ శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. అయితే మిల్కా సింగ్ మరణంపై సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో , , మోహన్ లాల్ చేసిన పోస్ట్‌లు అందరినీ టచ్ చేస్తున్నాయి. ఈ వార్త విని హృదయం బద్దలైంది. ఫ్లైయింగ్ సిక్, ఓ లెజెండ్‌ని మనం ఈ రోజు కోల్పోయాం. మిల్కా సింగ్ ఇక లేరు. స్వాతంత్ర్యం తరువాత మన దేశం ఎలా నడవాలో ఆలోచిస్తుంటే.. నువ్ మాత్రం ఎలా పరిగెత్తాలో చూపించావ్.. పెద్ద పెద్ద కలలను కనడం నేర్పించావ్.. వాటిని ఎలా చేజిక్కించుకోవాలి.. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎలా సాధించాలో నేర్పించావ్. భావి తరాలను కూడా మీరు ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటారు. మన జాతీయ జెండా గర్వంగా ఎగిరేలా చేసిన మీకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ మా హీరోనే. ఈ జాతి మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. మీ జీవితం నుంచి ఎన్నో నేర్చుకుంటుంటాం అని నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని ప్రకటించారు. ఇక మహేష్ బాబు స్పందిస్తూ.. ఆటల్లో లెజెండ్ అయిన మిల్కా సింగ్ మరణం నాకెంతో బాధను కలిగించింది. ఈ జాతి ఓ రత్నాన్ని కోల్పోయింది. ఆయన జీవితం తరతరాల్లోనూ స్ఫూర్తినింపుతూనే ఉంటుంది. ఆత్మకు శాంతి చేకూరాలి అని ప్రార్థించారు. ఇక మోహన్ లాల్ పోస్ట్ చేస్తూ.. గొప్ప అథ్లెట్ ఇంకా ఎంతో గొప్ప మనిషి. మిల్కా సింగ్ ఎంతో మందికి స్ఫూర్తిప్రధాత. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wFBoAF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....