Friday, 4 June 2021

Mahesh Babu: ‘సర్కారు వారి పాట’కి మరో టెన్షన్.. ప్రతినాయకుడు అర్జున్‌తో కథానాయకుడికి తిప్పలు తప్పవా?

ఏ సినిమా ఎప్పుడు వస్తుందో.. అసలు రిలీజ్ అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఇండస్ట్రీ వర్గాలు ఉండగా.. అప్ కమింగ్ మూవీ అప్డేట్స్ మాత్రం హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు-పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి మహేష్ ఫ్యాన్స్‌ని టెన్షన్ పెడుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ కనిపించబోతున్నారని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. అయితే అర్జున్ గతంలో టాలీవుడ్‌లో ప్రతినాయకుడిగా చేసిన చిత్రాలు సరిగా ఆడకపోవడంతో ‘నెగిటివ్’ ఎఫెక్ట్ ఉండబోతుందనే టాక్ నడుస్తోంది. అయితే నటన పరంగా అర్జున్‌కి తిరుగులేదు. గతంలో ఆయన ప్రతినాయకుడిగా నటించిన సినిమాలు ఫెయిల్ అయ్యాయంటే.. కథలో కంటెంట్ లేకపోవడం వల్లే. అయితే దర్శకుడు పరశురామ్ అలాంటి తప్పు చేయడని అర్జున్ కోసం ఓ విలక్షణమైన పాత్రను డిజైన్ చేసే ఉంటాడనేది ఇండస్ట్రీ టాక్. అయితే ఈ సినిమాలో అర్జున్ నెగిటివ్ షేడ్స్ రోల్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. ఇక షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. తొలి షెడ్యూల్‌ని దుబాయ్‌లోకంప్లీట్ చేయగా.. ఇటీవల రెండో షెడ్యూల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి కారణంగా రెండో షెడ్యూల్ షూటింగ్‌కి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ చేయగానే మూడో షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేశ్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vWD8Fn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....