Saturday, 19 June 2021

Kiara Advani: శంకర్-రామ్ చరణ్ మూవీ క్రేజీ అప్డేట్.. హీరోయిన్‌గా మళ్లీ ఆమె.! భయపెడుతున్న సెంటిమెంట్

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌లో లాక్ అయిన మెగా పవర్ స్టార్ తేజ్.. ఆ సినిమా తరువాత సెన్సేషనల్ దర్శకుడు శంకర్‌తో పాన్ ఇండియా చిత్రానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్‌కి ఇది 50వ చిత్రం కాగా.. రామ్ చరణ్‌కి 15 మూవీ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా.. ఈ క్రేజ్ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ వేట మొదలైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. చెర్రీతో జోడీ కడుతుందని ఊహాగానాలు వినిపించాయి. ఆమెతో పాటు సౌత్ కొరియన్ బ్యూటీ సుజిబీ పేరు వినిపించింది. అయితే అనూహ్యంగా ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీకి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టినట్టు తెలుస్తోంది. వినయ విధేయరామ చిత్రంలో రామ్ చరణ్‌తో జోడీ కట్టిన కియారాకి మరో ఛాన్స్ ఇచ్చారట చెర్రీ. అయితే రామ్ చరణ్ కెరియర్‌లోనే వినయ విధేయ రామ చిత్రం ఘోరపరాజయాన్ని చవిచూసింది. భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయితే ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌నే మళ్లీ రిపీట్ చేస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. చూడాలి మరి ఈసారి ఈ కాంబో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందేమో.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gIxgt7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....