Wednesday, 23 June 2021

సినిమా రౌండప్: వెంకీమామ ట్రీట్.. చెర్రీతో ఎన్టీఆర్ జాయిన్.. మిస్ చేసుకున్న ప్రభాస్

మిస్ ‌ పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో బిజీ అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ రూపంలో ప్ర‌భాస్ 150 కోట్ల రూపాయల మేర‌కు న‌ష్ట‌పోయారంటూ వస్తున్న వార్త‌లు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పలు కంపెనీల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నా.. యాడ్స్ కంటే సినిమాల వైపే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట ప్రభాస్. చెర్రీతో జాయిన్ రాజమౌళి రూపొందిస్తున్న RRR మూవీ తిరిగి సెట్స్ పైకి వచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. , ఎన్టీఆర్ ఇద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఓ సాంగ్ షూట్ చేస్తున్నారని సమాచారం. మరికొద్ది రోజుల్లో ఆలియా కూడా జాయిన్ కానుందట. జూలై నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ ఫినిష్ అయినట్లే అని తెలుస్తోంది. వెంకీమామ ట్రీట్ వెంకటేష్, ప్రియమణి జంటగా రూపొందుతున్న 'నారప్ప' మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ రెడీ చేశారట. వచ్చే వారంలో ఈ సినిమా టీజర్‌ విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే రోజు చిత్ర విడుదల తేదీపై కూడా ఓ క్లారిటీ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ‘అసురన్‌’కి రీమేక్‌గా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. బిగ్ బీ పెద్ద మనసు బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్ మరోసారి ఉదారత చాటుకున్నారు. 1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్‌లో గల లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రికి అందజేశారు. బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్‌ భామతో మెగాస్టార్ చిరంజీవి- బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ 154వ చిత్రంగా ఈ ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అయితే ఈ సినిమాలో చిరంజీవి సరసన బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెతో డీల్ కుదుర్చుకున్నారట మేకర్స్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35OrKzW

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...